News May 16, 2024

చిత్తూరు: చెరువులో పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

image

వడమాలపేట మండలం గూళూరు చెరువులో ప్రమాదవశాత్తు నీట మునిగి ముగ్గురు అక్కాచెల్లెళ్లు గురువారం మృతి చెందారు. మృతులు ముగ్గురూ ఎస్‌బిఆర్‌ పురం గ్రామానికి చెందిన బాబు, విజయ దంపతుల కుమార్తెలు కావడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. గూళూరు చెరువులో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకోవడానికి దిగారు. ప్రమాదావశాత్తు ఒక్కరు నీటిలో పడిపోయారు. వీరిని కాపాడే ప్రయత్నంలో మిగిలిన ఇద్దరు పడి మృత్యువాత పడ్డారు.

Similar News

News December 18, 2025

డ్వాక్రా రుణాల్లో వెనుకబడ్డ చిత్తూరు

image

డ్వాక్రా రుణాల పంపిణీలో చిత్తూరు జిల్లా వెనుకబడింది. జిల్లాలో డ్వాక్రా సంఘాల లక్ష్యం మేరకు రుణాలు పంపిణీ చేయడంలో అధికారులు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోయారు. MCP-1(ఉత్పాదక రుణాలు), MCP-2 (విని యోగ రుణాలు) కింద 63% రుణాలను మాత్రమే పంపిణీ చేశారు. జిల్లాకు రూ.2427.51 కోట్ల లక్ష్యం ఉండగా, రూ.1527.24 కోట్ల రుణాలు మాత్రమే బ్యాంకు లింకేజీ ద్వారా పంపిణీ చేశారు.

News December 18, 2025

టాప్‌లో చిత్తూరు జిల్లా

image

ఆధార్ అప్‌డేట్‌లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆధార్ నిబంధనల మేరకు 5-7 ఏళ్ల, 15-17 ఏళ్ల మధ్యలో వయసున్న పిల్లల ఆధార్ అప్‌డేట్ చేయాలి. చిత్తూరు జిల్లాలో 48,948 మంది పిల్లలు ఈ వయసు వారు ఉండగా డిసెంబర్ 13వ తేదీ నాటికి 30,929 మంది అప్‌డేట్ చేసుకున్నారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తంగా 63%తో చిత్తూరు జిల్లా ఆధార్ అప్‌డేట్‌లో మొదటి స్థానంలో ఉంది.

News December 17, 2025

సమావేశానికి హాజరైన చిత్తూరు కలెక్టర్

image

జిల్లా కలెక్టర్‌లతో సీఎం చంద్రబాబు అమరావతిలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లుగా పని చేయాలని, ప్రభుత్వంపై సానుకూలత రావాలంటే అధికారులే కీలకమని సీఎం సూచించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని ఆదేశించారన్నారు.