News September 14, 2024

చిత్తూరు: రాళ్లు పడి గాయపడ్డ వారిలో ఒకరు మృతి

image

ఎన్ హెచ్ పనులవద్ద టిప్పర్ పై నుంచి రాళ్లు పడి తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిలో ఒకరు మృతిచెందారు. బి.కొత్తకోట సీఐ రాజారెడ్డి కథనం.. బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల కార్మికులు శనివారం ములకలచెరువు, మదనపల్లె ఎన్ హెచ్ పనులు తుమ్మనగుట్టలో చేస్తున్నట్లు చెప్పారు. పని జరిగేచోట టిప్పర్లోని రాళ్లు వారిమీదపడి గాయపడగా, మదనపల్లె జిల్లా అస్పత్రికి తరలించారు. వారిలోబీహారుకు చెందిన అతుల్ కుమార్ సింగ్ మృతి చెందాడన్నారు.

Similar News

News September 19, 2024

చిత్తూరు: 100 రోజుల పాలనపై మీ కామెంట్ ఏంటి?

image

చిత్తూరు జిల్లాలో పుంగనూరు, తంబళ్లపల్లి మినహా మిగతా సీట్లూ గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్నక్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని YCP విమర్శిస్తోంది. 100 రోజుల పాలన, మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ కామెంట్

News September 19, 2024

తిరుపతి: RTCలో అప్రెంటీస్‌‌షిప్‌నకు నోటిఫికేషన్

image

ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్ చేయడానికి ఐటీఐ ఉత్తీర్ణులైన వారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కడప జోన్-4 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెంగల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీజిల్ మెకానిక్ 97, మోటార్ మెకానిక్ 6, ఎలక్ట్రిషియన్ 25, వెల్డర్ 4, పెయింటర్ 2, ఫిట్టర్ 9, డ్రాఫ్ట్ మెన్ సివిల్ 1 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పారు. అక్టోబర్ 3వ తేదీలోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News September 19, 2024

CM సహాయనిధికి చంద్రగిరి మాజీ MLA రూ.2 కోట్లు విరాళం

image

వరద బాధితుల సహాయార్థం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే గల్లా అరుణ కుమారి ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు కోట్లు ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్థిక సహాయ చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబీకులు పాల్గొన్నారు.