News April 11, 2025

చిత్తూరులో మహాత్మ జ్యోతిరావ్ ఫూలే జయంతి

image

చిత్తూరులో మహాత్మ జ్యోతిరావ్ ఫూలే జయంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని దురాలోచనలను పోగొట్టడానికి జ్యోతిరావ్ ఫూలే అపారమైన కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల బీసీ కన్వీనర్ షణ్ముగం, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 18, 2025

చిత్తూరు జిల్లాలో పారిశ్రామిక పార్కులు

image

చిత్తూరు జిల్లాలోని 7నియోజకవర్గాల్లో 3 విడతల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నారు. మొదటి విడతలో కుప్పం 34.57 ఎకరాలు(పొగురుపల్లి), పలమనేరు 4 ఎకరాలు(నంగమంగళం), రెండో విడతలో చిత్తూరులో 67.91 ఎకరాలు (వెంకటాపురం), నగరి 50 ఎకరాలు (మాంగాడు), పుంగనూరులో 21.08 ఎకరాల్లో పార్కులు నిర్మిస్తారు. మూడో విడతలో పూతలపట్టులో 87.75 ఎకరాలు, జీడీనెల్లూరులో 81.87 ఎకరాల్లో MSME పార్కులు ఏర్పాటు కానున్నాయి.

News December 18, 2025

డ్వాక్రా రుణాల్లో వెనుకబడ్డ చిత్తూరు

image

డ్వాక్రా రుణాల పంపిణీలో చిత్తూరు జిల్లా వెనుకబడింది. జిల్లాలో డ్వాక్రా సంఘాల లక్ష్యం మేరకు రుణాలు పంపిణీ చేయడంలో అధికారులు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోయారు. MCP-1(ఉత్పాదక రుణాలు), MCP-2 (విని యోగ రుణాలు) కింద 63% రుణాలను మాత్రమే పంపిణీ చేశారు. జిల్లాకు రూ.2427.51 కోట్ల లక్ష్యం ఉండగా, రూ.1527.24 కోట్ల రుణాలు మాత్రమే బ్యాంకు లింకేజీ ద్వారా పంపిణీ చేశారు.

News December 18, 2025

టాప్‌లో చిత్తూరు జిల్లా

image

ఆధార్ అప్‌డేట్‌లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆధార్ నిబంధనల మేరకు 5-7 ఏళ్ల, 15-17 ఏళ్ల మధ్యలో వయసున్న పిల్లల ఆధార్ అప్‌డేట్ చేయాలి. చిత్తూరు జిల్లాలో 48,948 మంది పిల్లలు ఈ వయసు వారు ఉండగా డిసెంబర్ 13వ తేదీ నాటికి 30,929 మంది అప్‌డేట్ చేసుకున్నారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తంగా 63%తో చిత్తూరు జిల్లా ఆధార్ అప్‌డేట్‌లో మొదటి స్థానంలో ఉంది.