News February 10, 2025
చిరుమళ్ల జాతరకు పోదాం.. చలో.. చలో..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739093697607_1280-normal-WIFI.webp)
సమ్మక్క జన్మస్థలమైన చిరుమల్లలో జాతరకు అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమల్లలో చందా వంశస్థులు ఇక్కడ జరుపుతారు. ఐదు రోజులపాటు జరగనున్న ఉత్సవాలు ఈ నెల 11 నుంచి మొదలు కానున్నాయి. ఎదురుగుట్ట నుంచి పగిడిద్ద రాజును, ముసలమ్మ గుట్ట నుంచి సమ్మక్కను ఇక్కడికి తీసుకొచ్చి కళ్యాణం జరపడం ఈ జాతర ప్రత్యేకత. మేడారం జాతర అయిన మరుసటి ఏడాది ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు.
Similar News
News February 11, 2025
నాలుగు లేన్లుగా కరకట్ట రోడ్డు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739234232898_367-normal-WIFI.webp)
AP: విజయవాడ నుంచి రాజధాని అమరావతి వెళ్లేందుకు ప్రస్తుతమున్న కరకట్ట రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. దాదాపు అలైన్మెంట్ పూర్తి కాగా త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం భూసేకరణ/భూసమీకరణ చేయాలా? అనే దానిపై సీఎంతో చర్చించాక నిర్ణయం తీసుకోనున్నారు. కృష్ణా నది వరదలను తట్టుకునేలా కరకట్టను బలోపేతం చేయనున్నారు.
News February 11, 2025
రాజమండ్రిలో మైనర్ బాలిక మిస్సింగ్..కేసు నమోదు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739239766842_1128-normal-WIFI.webp)
రాజమండ్రిలో మైనర్ బాలిక అదృశ్యమైంది. స్థానిక సంజీవనగర్కు చెందిన సిద్దాబత్తుల లక్ష్మీ ప్రసన్న(17) కనిపించడం లేదంటూ త్రీ టౌన్ పోలీసులకు ఆమె తల్లి నాగలక్ష్మి సోమవారం రాత్రి ఫిర్యాదు చేసింది. స్థానిక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న బాలికను చదువు మాన్పించారు. 8వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. త్రీ టౌన్ సీఐ సూర్య అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
News February 11, 2025
కాంగ్రెస్ షోకాజ్ నోటీసును పట్టించుకోను: తీన్మార్ మల్లన్న
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739234868427_729-normal-WIFI.webp)
కాంగ్రెస్ ఇచ్చిన షోకాజ్ నోటీసును పట్టించుకోనని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. నల్గొండలో టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్కు ఆయన హాజరై మాట్లాడారు. బీసీ ఉద్యమాన్ని అణచివేయడానికి ఓ వర్గం చేస్తున్న కుట్రనే షోకాజులు అని మండిపడ్డారు. అభ్యర్థులు పూల రవీందర్, సుందర్ రాజ్ యాదవ్కు బీసీలు ఓట్లు వేసుకున్నా బంపర్ మెజార్టీతో గెలుస్తారన్నారు. ఇతర వర్గాలకు చెందిన వారికి డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు.