News February 24, 2025
చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదం.. 13 ఏళ్ల బాలుడు మృతి

చిలకలూరిపేట మండల పరిధిలోని గోపాళంవారిపాలెం పల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయ్ (13) అనే యువకుడు దుర్మరణం చెందాడు. గోపాళంవారిపాలెంకు చెందిన ముగ్గురు పిల్లలు పల్సర్ బైక్ పై వెళుతున్నారు. ఆర్టీసీ బస్ను క్రాస్ చేస్తూ, ఎదురుగా వస్తున్న ఎక్సల్ వాహనంను ఢీకొట్టారు. ప్రమాదంలో విజయ్ అక్కడికక్కడే చనిపోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 24, 2025
SVSCలో పెద్దోడు, చిన్నోడు పేర్లివే!

టాలీవుడ్ బెస్ట్ క్లాసిక్లలో ఒకటైన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా మరోసారి థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటించిన వెంకటేశ్, మహేశ్బాబుల క్యారెక్టర్ల పేర్లు రివీల్ అయినట్లు తెలుస్తోంది. పెద్దోడు, చిన్నోడు క్యారెక్టర్లకు పెట్టిన పేర్లివే. పెద్దోడు సిరి మల్లికార్జునరావు, చిన్నోడు సీతారామ రాజు అని IMDలో పేర్కొన్నారు. దీనిని ఇరు హీరోల ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.
News February 24, 2025
గాంధారి: పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: నోడల్ అధికారి

ఈ నెల 5 నుంచి ప్రారంభమై ఇంటర్ పరీక్షకు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం సూచించారు. సోమవారం గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గంగారం, అధ్యాపకులు లక్ష్మణ్, విజయ్ కుమార్, సరిత, సుజాత, రమేశ్ పాల్గొన్నారు.
News February 24, 2025
వైభవంగా నూకాంబిక జాతర రాట ఉత్సవం

ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీనూకాంబిక అమ్మవారి దేవస్థానంలోని బాలాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. కొత్త అమావాస్య జాతర సందర్భంగా ముహూర్తం రాట మహోత్సవం జరిగింది. దేవాదాయ శాఖ ఉప కమిషనర్, ఆలయ ఈవో ఎన్.సుజాత, దేవాదాయ డీసీ ఆఫీస్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుధారాణి, ఈవో శేఖర్ బాబు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.