News April 10, 2024

చీరాల: ‘మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తా’

image

ఇటీవలే పదో తరగతి పరీక్షలు అయిపోయిన విషయం విధితమే. తాజాగా మూల్యాంకనం నిర్వహించారు. చీరాలకు చెందిన ఓ విద్యార్థి ‘నాకు మార్కులు వేయకపోతే.. మా తాత చేత చేతబడి చేయిస్తా’ అని రాశాడు. దీంతో విస్తుపోయిన టీచర్ దానిని పై అధికారులకు చూపించారు. అయితే ఈ విద్యార్థికి వందకు 70 మార్కులు రావడం విశేషం. మరో సబ్జెట్‌లో మంధర.. శివాజీ మహారాజును తీసుకుని దండకారణ్యానికి వెళ్లింది. అని రాయడంతో ఉపాధ్యాయులు అవాక్కయ్యారు.

Similar News

News April 11, 2025

ప్రకాశం: నిప్పులు కురిపించిన భానుడు

image

కనిగిరి నియోజకవర్గంలోని నందన మారెళ్ళలో గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా 41.8° ఉష్ణోగ్రత నమోదయినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగులోపు అత్యవసరం అయితే తప్ప బయట తిరగవద్దు అని పేర్కొన్నారు.

News April 11, 2025

లేబర్ సిస్టం రద్దుపై కలెక్టర్ సమావేశం

image

జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా లేబర్ సిస్టం రద్దు నిర్ణయంపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ఒంగోలులోని స్పందన భవనంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు, ఎదురయ్యే సవాళ్లు, ఇతర  అంశాల గురించి చర్చించారు. లేబర్ సిస్టం రద్దు వల్ల కార్మికుల హక్కులు, రక్షణలు కచ్చితంగా కల్పించబడతాయన్నారు. కార్యక్రమంలో కార్మిక ఉప కమిషనర్ గాయత్రి దేవి పాల్గొన్నారు.

News April 10, 2025

లేబర్ సిస్టం రద్దుపై కలెక్టర్ సమావేశం

image

జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా లేబర్ సిస్టం రద్దు నిర్ణయంపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ఒంగోలులోని స్పందన భవనంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు, ఎదురయ్యే సవాళ్లు, ఇతర  అంశాల గురించి చర్చించారు. లేబర్ సిస్టం రద్దు వల్ల కార్మికుల హక్కులు, రక్షణలు కచ్చితంగా కల్పించబడతాయన్నారు. కార్యక్రమంలో కార్మిక ఉప కమిషనర్ గాయత్రి దేవి పాల్గొన్నారు.

error: Content is protected !!