News April 30, 2024

చెంగాళమ్మను విస్మరిస్తే పదవి గల్లంతే..!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట చెంగాళమ్మ దర్శనానికి వెళ్లకుండా ఉంటే పదవి పోతుందనే నమ్మకం ఉంది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆలయం దారిగుండా కారులో వెళ్లారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. మరో ప్రధాని ఐకే గుజ్రాల్ శ్రీహరికోటకు వచ్చినా అమ్మవారిని దర్శించుకోలేదు. 1998లో ఆయన పదవిని కోల్పోయారు. తమిళనాడు సీఎం జయలలిత, ఎన్టీఆర్‌కు కూడా ఇలాగే పదవీగండం కలిగిందని స్థానికులు చెబుతారు.

Similar News

News September 30, 2024

SVU : నేడే లాస్ట్ డేట్.. Don’t Miss It

image

SV యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (UG) వార్షిక విధానంలో 1990- 2015 మధ్య ఒక సబ్జెక్టు, 2 అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు, ప్రాక్టికల్స్ ఫెయిలైన అభ్యర్థులకు మెగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటి పరీక్ష ఫీజు చెల్లించడానికి సోమవారంతో గడువు ముగుస్తుందని యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫైన్ తో అక్టోబర్ 15 వరకు గడువు ఉన్నట్లు తెలియజేశారు.

News September 30, 2024

నెల్లూరులో రైలు ఢీకొని మహిళ మృతి

image

నెల్లూరు రైల్వే స్టేషన్‌లో ఆదివారం రాత్రి గూడ్స్ ట్రైన్ ఢీకొని ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన రైల్వే పోలీసుకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 30, 2024

నెల్లూరు: RTC బస్సు ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్

image

సంగం- కొరిమెర్ల మార్గమధ్యంలో రోడ్డు మలుపు వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. విడవలూరు మండలం అన్నారెడ్డిపాళెంకు చెందిన నరసింహరావు(24) ఏఎస్ పేటలో జరిగే గంధమహోత్సవానికి బైక్‌పై వెళ్తుండగా సంగం- కలిగిరి రహదారిలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్‌టీసీ బస్ ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.