News February 23, 2025
చేన్నేకొత్తపల్లి: పాము కాటుకు గురై చిన్నారి మృతి

చేన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురానికి చెందిన ప్రీతి అనే మూడో తరగతి విద్యార్థిని శనివారం రాత్రి పాముకాటుకు గురై మృతి చెందారు. శనివారం రాత్రి ప్రీతి ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా.. నాగుపాము కాటు వేయడంతో ఆమెను తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం పుట్టపర్తి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు విద్యార్థిని తల్లితండ్రులు తెలిపారు.
Similar News
News February 24, 2025
నేటి ముఖ్యాంశాలు

* అన్ని జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు: పీఎం మోదీ
* భయంకరంగా శ్రీశైలం టన్నెల్ ప్రమాద తీవ్రత: మంత్రి జూపల్లి
* ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుండు సున్నానే: కిషన్ రెడ్డి
* AP: జగన్ 2 దశాబ్దాలు విపక్ష నేతగా ఉండాలి: మంత్రి సుభాష్
* ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు పూర్తి
* పాకిస్థాన్పై భారత్ ఘన విజయం
News February 24, 2025
రోహిత్ శర్మ రికార్డు

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు చేరింది. వన్డేల్లో అత్యంత వేగంగా 9వేల పరుగులు పూర్తి చేసిన ఓపెనర్గా ఆయన నిలిచారు. పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచులో పరుగుల ఖాతా తెరిచి ఈ మైలురాయి చేరుకున్నారు. 181 ఇన్నింగ్సుల్లోనే ఆయన ఈ ఘనత అందుకున్నారు. ఆ తర్వాత స్థానాల్లో సచిన్(197), గంగూలీ(231), గేల్(246), గిల్ క్రిస్ట్(253), జయసూర్య(268) ఉన్నారు.
News February 24, 2025
భారత జట్టుకు ప్రముఖుల విషెస్

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్పై ఘన విజయం సాధించిన టీమ్ ఇండియాకు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ గొప్ప విజయాన్ని అందుకుందని AP CM చంద్రబాబు అన్నారు. జట్టుకు TG CM రేవంత్ కంగ్రాట్స్ తెలియజేశారు. అద్భుతమైన మ్యాచ్ను లైవ్లో వీక్షించడం మరచిపోలేని అనుభూతి అని చిరంజీవి, మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.