News April 26, 2024
చేవెళ్లలో 64 మంది 88 నామినేషన్లు
RR జిల్లా చేవెళ్ల లోక్సభ స్థానానికి 64 మంది అభ్యర్థులు 88 నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి నాలుగో సెట్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తరఫున ఆయన తనయుడు కాసాని వీరేశ్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్వతంత్రులు నామినేషన్ వేశారు.
Similar News
News September 24, 2024
HYD: డిగ్రీ సీట్లకు 25 నుంచి స్పాట్ ప్రవేశాలు
దోస్త్ పరిధిలోని ప్రైవేట్, ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలల్లో స్పాట్ ప్రవేశాలు జరగనున్నాయి. ఈ నెల 25 నుంచి 27 వరకు స్పాట్ విధానంలో సీట్లను ఆయా కళాశాలల యాజమాన్యాలు భర్తీ చేసుకోవచ్చని దోస్త్ కన్వీనర్ ప్రొ.ఆర్. లింబాద్రి తెలిపారు. స్పాట్ కౌన్సిలింగ్కు హాజరయ్యే విద్యార్థులు ఓరిజినల్ బోనఫైడ్ సర్టిఫికేట్స్, ఫొటో, ఆధార్ కార్డ్, 2 జిరాక్సు సెట్స్ తీసుకురావాలని కోరారు.
News September 24, 2024
పటాన్చెరులో నేడు రేషన్ డీలర్ల సభ
నేడు పటాన్చెరులో న్యాయమైన డిమాండ్లకు రేషన్ డీలర్ల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారని రాష్ట్ర అధ్యక్షుడు గూడెం మహిపాల్ రెడ్డి (MLA), రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ నాయికోటి రాజు తెలిపారు. ఓ కన్వెన్షన్ హాల్లో జరిగే సభకి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో డీలర్లు హాజరు కానున్నారు. అలాగే ఈ సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరుకానున్నారని రేషన్ డీలర్ల సంఘం సభ్యులు తెలిపారు.
News September 24, 2024
HYD: ఇకపై అన్నింటికీ ఒకే డిజిటల్ కార్డు
రాష్ట్రంలో రేషన్, ఆరోగ్యం, ఇతర సంక్షేమాలన్నింటికీ ప్రతి కుటుంబానికి ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉండేలా ప్రభుత్వం కార్యాచరణకు పూనుకుంది. HYDలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక మీటింగ్ నిర్వహించారు. కుటుంబ సభ్యుల మార్పు, చేర్పులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేలా ఈ కార్డు రూపొందించనున్నారు. సమగ్ర కుటుంబ వివరాల నమోదుపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు.