News April 12, 2024

చేవెళ్లలో BRSకు షాక్.. కాంగ్రెస్‌లోకి ZPTC

image

చేవెళ్ల మండల ZPTC మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి శుక్రవారం BRSను వీడారు. పామెన భీం భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. MP అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి హస్తం కండువా కప్పి ఆహ్వానించారు. అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నిర్ణయించుకొని పార్టీలో చేరామన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ రెడ్డి ఉన్నారు. కాగా, రేపు KCR సభ ఉండగా ఒకరోజు ముందు కీలక నేత పార్టీ మారడం చర్చనీయాంశమైంది.

Similar News

News September 23, 2024

గ్రేటర్ HYDలో RTC బస్‌పాస్ REPORT

image

2024 ఆగస్టులో ప్రవేశపెట్టిన మెట్రో డీలక్స్ మంత్లీ బస్‌పాస్‌ కొద్ది రోజుల్లోనే 750 మంది కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు. రూ.1450 విలువైన ఈ పాస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ-మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లోనూ చెల్లుబాటు అవుతోంది. ప్రస్తుతం నగరంలో 10,000 మంది ఆర్డినరీ, 75,000 మంది మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ వినియోగిస్తున్నట్లుగా వెల్లడించారు.

News September 23, 2024

రాజేంద్రనగర్: అగ్రి హబ్‌లో స్టార్ట్ అప్స్ జోరు!

image

రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రిహబ్‌లో తొలుత 13 స్టార్ట్ అప్స్ ఏర్పాటయ్యాయని CEO విజయ్ తెలిపారు. గత మూడేళ్లలో వాటి సంఖ్య 92కి పెరిగిందని, మరో వెయ్యి అంకురాలు నమోదు చేసుకున్నాయన్నారు. 11 అంకుర సంస్థలు తమ ఆవిష్కరణపై మేధోసంపత్తి హక్కులు పొందాయని, 2,450 మంది తమ ఆలోచనలను పంచుకున్నారు. ఆరు వేల మంది రైతులు పరిశోధన కార్యక్రమాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు.

News September 23, 2024

HYD: అక్టోబర్ 2 నుంచి ఆపరేషన్ సీవరెజ్

image

గ్రేటర్ HYD నగరంలో అక్టోబర్ 2 నుంచి జలమండలి ఆపరేషన్ సీవరెజ్ చేపట్టనుంది. 30 రోజుల పాటు 7050 కిలోమీటర్ల డ్రైనేజీ లైన్లను క్లీన్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 225 ఎయిర్ టేక్ యంత్రాలను సైతం వినియోగించనున్నారు. జలమండలి పరిధిలోని అనేక చోట్ల చిన్నపాటి వర్షాలకే దాదాపు 3 లక్షల వరకు మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి.