News May 13, 2024
చేవెళ్లలో ఓటేసిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటే అత్యంత కీలకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ అమూల్యమైన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యువ నేత కార్తీక్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Similar News
News October 8, 2024
HYD: రూ.1 కోటి పలుకుతున్న కిలో డ్రగ్
తెలంగాణలో బహిరంగ మార్కెట్లో ఎంఫిటమైన్ ముడి ధరలు కిలో రూ.1 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకూ పలుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిమాండ్ను బట్టి దళారులు ఈ ధరలను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ ముడి సరుకును ల్యాబ్కు తరలించి ఎండీఎం తయారీకి ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. కూకట్పల్లిలో ఎంఫిటమైన్ తయారీ చేస్తున్న వారిని అరెస్టు చేయడంతో వివరాలు వెలుగులోకి వచ్చాయి.
News October 7, 2024
HYD: యాక్సిడెంట్లో చనిపోయింది వీరే..!
HYD బాలాపూర్ పరిధి మీర్పేట్ PS పరిధిలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరి వివరాలు పోలీసులు తెలిపారు. షేక్ మదీనా (కుడి) బాషాTGRTCలో అసిస్టెంట్ మెకానిక్గా పని చేస్తున్నాడు. అన్నోజు శ్రావణ కుమార చారి (ఎడమ) TKR కాలేజ్లో సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తున్నాడు. మదీనా బాషా TKR కమాన్ వైపు వెళ్తుండగా శ్రావణ లిఫ్ట్ అడిగాడు. వీరి మరణవార్తతో కుటుంబపెద్దలను కోల్పోయామని వారు రోదిస్తున్నారు.
News October 7, 2024
HYDలో కోటికి చేరనున్న వాహనాల సంఖ్య!
HYDలో రాబోయే పదేళ్లలో వాహనాల సంఖ్య కోటి దాటనుందని నిపుణులు అంచనా వేశారు. కానీ.. ఆ స్థాయిలో రోడ్లు విస్తరణకు, నిర్మాణానికి నోచుకోక, ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. ట్రాఫిక్ సమస్య నివారణకు ‘ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కమిటీకి’ జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి నడుంబిగించారు. ట్రాఫిక్, ఐటీ విభాగాల అదనపు కమిషనర్లు ఈ కమిటీలు సభ్యులుగా ఉంటారని తెలిపారు.