News March 14, 2025
చొప్పదండి: పరీక్షల భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

చొప్పదండి మండలం రుక్మాపూర్కు చెందిన పూసాల రోహిత్(17) కరీంనగర్లోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం రోహిత్ పెద్దమ్మ రావుల అరుణ నిద్రలేచి చూడగా.. వరండాలో చీరతో ఉరేసుకుని కనిపించాడు. పరీక్షల్లో ఫెయిల్ అవుతాడనే భయంతో ఉరేసుకున్నట్లు ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపారు. మృతుడి తల్లి కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
Similar News
News March 15, 2025
గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాల్లో సత్తాచాటిన బీర్పూర్ యువకుడు

బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన చీరనేని రాజశేఖర్ ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో 287 ర్యాంకు, గ్రూప్-3 ఫలితాల్లో 86 రాంక్ సాధించారు. ప్రస్తుతం ఆర్మూర్ డిగ్రీ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. గతంలో రైల్వేలో ఉద్యోగం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ ఆఫీసర్ కూడా విధులు నిర్వర్తించారు. దీంతో తల్లిదండ్రులు చంద్రయ్య, రాజవ్వ, గ్రామస్థులు రాజశేఖర్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
News March 15, 2025
గ్రీన్కార్డు హోల్డర్స్ శాశ్వత పౌరులేమీ కాదు: జేడీ వాన్స్

గ్రీన్ కార్డు సిటిజన్స్ అమెరికా శాశ్వత పౌరులేమీ కాదని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. USAకు వారివల్ల ప్రమాదం ఉందని తెలిస్తే వారినీ దేశం నుంచి బహిష్కరిస్తామన్నారు. గ్రీన్కార్డు హోల్డర్స్ ఇమిగ్రేషన్ పాలసీకి భంగం కలిగించనంత వరకే వారు దేశంలో ఉండేలా హక్కు ఉందని దానిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని తెలిపారు. అధ్యక్షుడు ఎవరినైనా USAనుంచి పంపించాలనుకుంటే వెళ్లాల్సిందేనని చెప్పారు.
News March 15, 2025
ఇవాళ అసెంబ్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తీర్మానంపై సమాధానం ఇవ్వనున్నారు. ఉ.10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్పై విపక్షాల విమర్శల నడుమ ఆయన ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇవాళ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పుపై సభలో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా పేరు మార్చనున్నట్లు సమాచారం.