News March 30, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

@కలెక్టరేట్లో ధర్మపురి MLA అడ్లూరి లక్ష్మణ్ అధికారులతో సమీక్ష సమావేశం @జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తు ఉగాది, రంజాన్ సంబురాలు @ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగిత్యాల MLA @రాయికల్లో పౌర హక్కుల దినోత్సవం @మెట్పల్లి ప్రభుత్వ కాలేజీలో మాదకద్రవ్య నిర్ములన పోస్టర్ ఆవిష్కరణ @బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా జడ్జి @మల్లాపూర్లో TDP జెండా ఆవిష్కరణ @కొండగట్టులో భక్తుల రద్దీ
Similar News
News April 2, 2025
ఎకరానికి రూ.31,000: మంత్రి ప్రకటన

AP: రిలయన్స్ <<15966046>>CBG ప్లాంట్లతో<<>> ప్రకాశం జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. గుజరాత్ కంటే ఏపీలోనే రిలయన్స్ ఎక్కువగా ఈ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోందన్నారు. వీటి ద్వారా బంజరు భూములు వినియోగంలోకి వస్తాయని చెప్పారు. ప్రభుత్వ భూమికి ఎకరానికి రూ.15వేలు, ప్రైవేట్ భూములకు రూ.31వేలు కౌలు చెల్లిస్తామన్నారు. కందుకూరులో ఇండోసోల్ ప్లాంట్, BPCL అందుబాటులోకి రానున్నాయన్నారు.
News April 2, 2025
నెల్లూరు: రైళ్లలో దోపిడీ దొంగల బీభత్సం

నెల్లూరు జిల్లాలో బిట్రగుంట-పడుగుపాడు రైల్వే స్టేషన్ల మధ్య దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టాలపై సాంకేతిక సమస్యను సృష్టించిన దొంగల ముఠా రెండు రైళ్లను ఆపి దోపిడీ చేసింది. అర్ధరాత్రి సమయంలో బెంగళూరు, చండీగఢ్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపారు. బోగీల్లోకి ప్రవేశించి మహిళల మెడలోని బంగారం గొలుసులు, బ్యాగులను దోచుకెళ్లారు.
News April 2, 2025
ADB: వేధింపులా.. 8712659953కి కాల్ చేయండి: SP

మహిళలు, విద్యార్థినులకు ఉద్యోగస్థలాల్లో, కళాశాలల్లో ఎలాంటి సమస్యలున్నా, వేధింపులకు గురైనా జిల్లా షీ టీం బృందాలను సంప్రదించాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. షీ టీం బృందాలను సంప్రదించడానికి 24 గంటలు పని చేసేలా ఒక మొబైల్ నెంబర్ 8712659953ను ఏర్పాటుచేశామన్నారు. జిల్లాలో గత నెలల్లో 34 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఫిర్యాదులు అందిన వాటిలో 3 కేసులు, మావల పీఎస్లో ఒక FIR నమోదు చేసినట్లు చెప్పారు.