News March 20, 2025
జగిత్యాల: పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈఓ

జగిత్యాల జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధంచేసినట్లు జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 67 పరీక్ష కేంద్రాల్లో 11,855 మంది రెగ్యులర్ విద్యార్థులు, 285 మంది బ్యాక్లాగ్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని ఆయన అన్నారు. 826 ఇన్విజిలేటర్ల ఆధ్వర్యంలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Similar News
News March 28, 2025
పలిమెల: అగ్నివీర్ ఎంపికైన రాకేశ్

పలిమెల మండలం పంకెనకు చెందిన బొచ్చు లక్ష్మయ్య- పుష్పలతల కుమారుడు రాకేశ్ ఇటీవల ప్రకటించిన అగ్ని వీర్ ఆర్మీ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి, మెరిట్ లిస్టులో ఆర్మీ జనరల్ డ్యూటీ క్యాటగిరిలో ఎంపికయ్యాడు. రాకేశ్ మాట్లాడుతూ.. తప తల్లిదండ్రులు నిరంతరం కష్టపడుతూ తనను చదివించారని, వారి కృషి వల్లనే ఉద్యోగం సాధించానని తెలిపాడు.
News March 28, 2025
అనకాపల్లి ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ను సందర్శించిన కలెక్టర్

అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శుక్రవారం స్థానిక ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ ను సందర్శించారు. మార్కెట్ యార్డ్ లో సమస్యలను కలెక్టర్కు ఎమ్మెల్యే వివరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. రైతు బజార్ ఏర్పాటు చేసి మార్కెట్ యార్డుకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. బెల్లం తయారు చేసే విధానాన్ని రైతులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు.
News March 28, 2025
మామిడికుదురు: పాము కాటుకు గురై యువతి మృతి

మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామానికి చెందిన కంచి శృతి (24) పాము కాటుకు గురై మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఉదయం 6.గంటల సమయంలో ఇంటి వద్ద బట్టలు ఉతుకుతుండగా చేతిపై పాము కాటు వేయడంతో స్థానికులు వెంటనే రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.