News March 3, 2025

జగిత్యాల: పీస్ కమిటీ మెంబర్లతో డీఎస్పీ సమావేశం

image

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల డీఎస్పీ రఘు చందర్, జగిత్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ఎస్ వేణుగోపాల్‌లు సోమవారం జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముస్లిం మత పెద్దలను, పీస్ కమిటీ మెంబర్లను పిలిపించి మాట్లాడారు.

Similar News

News March 4, 2025

ఆలూర్: గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదంలో గుత్ప వాసి మృతి

image

ఆలూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన చలిగంటి మోహన్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు. ఆర్థిక ఇబ్బందుల్లో అప్పులు పెరగడంతో గత ఐదు నెలల క్రితం దుబాయ్ వెళ్లి డెలివరీ బాయ్‌గా పని చేస్తుండగా ఫిబ్రవరి 23న కారు ప్రమాదంలో మరణించాడు. సోమవారం మృతదేహం స్వగ్రామానికి చేరుకోగా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. మోహన్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని గ్రామస్థులు కోరారు.

News March 4, 2025

MHBD: జిరాక్స్ సెంటర్లు మూసేయండి: కలెక్టర్

image

మహబూబాబాద్ జిల్లాలోని కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలు దగ్గర్లో ఉన్న జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయించాలని అధికారులను ఆదేశించారు.

News March 4, 2025

వెలుగోడు మండలం నుంచి ఎస్ఐలుగా యువతీ, యువకుడు

image

వెలుగోడు మండలం మాధవరానికి చెందిన మద్దెల సంజీవ కుమార్ కొడుకు సతీశ్, గుంతకందాలకు చెందిన వెంకటేశ్వర్లు కుమార్తె నాగ కీర్తన ఎస్ఐలుగా ఎంపికయ్యారు. అనంతపురం పోలీసు శిక్షణ కళాశాలలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న సతీశ్‌కు శ్రీ సత్యసాయి జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. నాగ కీర్తనకు కడపలో పోస్టింగ్ ఇచ్చారు. వీరిరువురినీ వారి కుటుంబ సభ్యులు అభినందించారు.

error: Content is protected !!