News March 19, 2025
జగిత్యాల: వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి

ఉమ్మడి KNR జిల్లాలో నిన్న నలుగురు వివిధ ఘటనల్లో చనిపోయారు. JGTLరూరల్(M) వెల్దుర్తికి చెందిన రాజం(55) అనే <<15808621>>రైతు<<>> అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. బోయినపల్లిలో జరిగిన రోడ్డుప్రమాదంలో గంగాధర(M) ఉప్పరమల్యాలకు చెందిన మల్లేశం(42) చనిపోయాడు. బసంత్నగర్కు చెందిన ఆరె అజయ్(24) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సైదాపూర్(M) బొమ్మకల్లో నీటి సంపులో పడి పజ్ఞాన్ అనే రెండేళ్ల బాలుడు మృతిచెందాడు.
Similar News
News March 19, 2025
వంజంగి అమ్మాయికి గేట్లో 25వ ర్యాంక్

ఆమదాలవలస మండలం వంజంగి గ్రామానికి చెందిన పైడి పూజిత నేడు విడుదలైన గేట్-2025 ఫలితాలలో ఆల్ ఇండియా 25 ర్యాంకు సాధించారు. పూజిత నాగపూర్లోని వీఎన్ఐటీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. పూజిత తండ్రి పైడి శ్రీనివాసరావు ఎల్.ఎన్.పేట ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. పూజిత తల్లి ఆదిలక్ష్మి గృహిణి. గేట్లో వంద మార్కులకు గాను 73 మార్కులు సాధించినట్లు తండ్రి శ్రీనివాస రావు తెలిపారు.
News March 19, 2025
ఫ్రిజ్లో 12 టన్నుల మేక మాంసం..!

హైదరాబాద్లోని మంగళ్హట్లో రూ.8 లక్షలు విలువ చేసే 12 టన్నుల మేక మాంసాన్ని GHMC టాస్క్ ఫోర్స్ సిబ్బంది సీజ్ చేశారు. మహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యాపారి తక్కువ ధరకు గొర్రెలు, మేకల మాంసాన్ని కొని ప్రిజ్లో భద్రపరుస్తున్నట్లు గుర్తించారు. ఇలా నిల్వచేసిన మాంసాన్ని హోటళ్లు, శుభకార్యాలకు సప్లై చేస్తున్నట్లు తేల్చారు. ఈ ఘటనతో రెస్టారెంట్లలో తినే ముందు ఆలోచించాల్సిందేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News March 19, 2025
నాగర్కర్నూల్: ప్రభుత్వ ఆస్పత్రిలో ఆధునిక పరికరాలు ప్రారంభం

నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న గర్భిణుల కోసం మెరుగైన సేవలు అందించేందుకు, సాధారణ ప్రసవాలు చేసేందుకు, అధునాతన హైడ్రాలిక్ టేబుల్స్ వినియోగించేందుకు ఆసుపత్రిలో లేబర్ రూమ్లో అధునాత పరికరాలను ప్రారంభించామని సూపరింటెండెంట్ ఆర్.రఘు తెలిపారు. ప్రతి గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం పొందాలని సూచించారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.