News March 22, 2025
జగిత్యాల: హిందీ పరీక్షకు 8 మంది విద్యార్థులు గైర్హాజరు

పదోతరగతి రెండోరోజు హిందీ పేపర్ రెగ్యులర్కు 11,849 విద్యార్థులకు 11,841 విద్యార్థులు హాజరయ్యారు. 8 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. రెగ్యూలర్ విద్యార్థుల హాజరుశాతం 99.93% సప్లిమెంటరీ విద్యార్థులు 4 విద్యార్థులకు 3 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరి హాజరుశాతం 75% అని అధికారులు తెలిపారు.
Similar News
News March 25, 2025
ట్రంప్కు గిఫ్ట్ పంపించిన పుతిన్

రష్యా అధ్యక్షుడు పుతిన్, US అధ్యక్షుడు ట్రంప్ మధ్య స్నేహం మరింత పెరుగుతోంది. ఈ నెల మొదట్లో ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కోఫ్కు భేటీ అనంతరం ట్రంప్ చిత్రపటాన్ని పుతిన్ ఆయనకు ఇచ్చారని మాస్కో ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వెల్లడించారు. ఆ బహుమతి పట్ల ట్రంప్ చాలా సంతోషించారని విట్కోఫ్ తాజాగా వెల్లడించారు. ఎప్పుడూ ఉప్పు-నిప్పుగా ఉండే అమెరికా, రష్యా బంధం ట్రంప్ వచ్చాక మెరుగుపడుతున్న సంగతి తెలిసిందే.
News March 25, 2025
BRS సభ వేదిక ఘట్కేసర్కి మార్పు!

BRS రజతోత్సవాల నేపథ్యంలో ఏప్రిల్ 27న నిర్వహించే బహిరంగ సభ వేదికను మార్పు చేస్తున్నట్లు సమాచారం. వేసవి తీవ్రత సందర్భంగా పార్కింగ్ సదుపాయాలు అన్ని జిల్లాల నుంచి రవాణా సదుపాయం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం, తాజా సభ కోసం HYD శివారు ఘట్కేసర్ వద్ద ప్రముఖ ప్రైవేట్ స్కూల్ వెనక ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు సమాచారం, ఉంది. ఉంది…!
News March 25, 2025
కరీంనగర్కు రెండు కొత్త కాలేజీలు

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వ ఇంజినీరింగ్, లా కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రెండు కళాశాలల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. శాతవాహన యూనివర్సిటీలో లా కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల కావాలని ఎప్పటినుంచో విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేశాయి. తాజాగా రెండు కళాశాలలు మంజూరు కావడంతో విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి.