News March 22, 2025

జడ్చర్ల: ‘విద్యుత్ సరఫరా లేక ఎండుతున్న పంటలు’

image

జడ్చర్ల మండలం కిష్టారం గ్రామంలో విద్యుత్ సరఫరా సరిగా లేక నీళ్లు పెట్టకపోవడంతో మొక్కజొన్న, వరి పంటలు ఎండిపోతున్నాయని కిష్టారం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా Way2Newsతో రైతు పి.వెంకటేశ్ మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరా సరిగా లేక వేల పెట్టుబడితో పెట్టిన పంటలు ఎండిపోయి నష్టపోతున్నామని, విద్యుత్ అధికారులు స్పందించి 24 గంటలు కరెంట్ సరఫరా చేయాలని అన్నారు.

Similar News

News March 26, 2025

MBNR: ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ  

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గంజాయి, కల్తీ కల్లు నిర్మూలనకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో తరఫున ప్రచార కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మహబూబ్ నగర్ జిల్లాఎస్పీ డి. జానకి, ప్రత్యేకంగాతెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో వారు రూపొందించిన గంజాయి & కల్తీకల్లు నిర్మూలన పోస్టర్‌ను విడుదల చేశారు. ఎస్పీ మాట్లాడుతూ యువత, ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు.

News March 25, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✔MBNR: PUలో ఉగాది కవి సమ్మేళనం!
✔BRS హయాంలో రంజాన్ తోఫా ఇచ్చే వాళ్ళం: మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్
✔NGKL:SLBC ఘటన.. మరొకరు మృతి
✔పలుచోట్ల ఇఫ్తార్ విందు!
✔GWL:Way2News Effect..అనాథలను రూ.4.15 లక్షలు అందజేత
✔పీయూ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ
✔కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు
✔కరెంటు కోతలపై వనపర్తిలో రైతుల ధర్నా
✔NGKL:SLBC ఘటన..బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం: కలెక్టర్

News March 25, 2025

BNR: నిర్వాసితులకు అన్ని రకాల మౌలిక వసతులు: R&R కమిషనర్

image

ఉదండపూర్ రిజర్వాయర్ నిర్వాసిత కుటుంబాలకు కేటాయించిన అర్&అర్ కాలనీలలోఅన్ని రకాల మౌలిక సౌకర్యాలు వేగవంతం చేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో అర్&అర్ పనులను సమీక్షించారు.

error: Content is protected !!