News April 3, 2025

జడ్చర్లలో జోరుగా వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు

image

జడ్చర్ల బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నేడు మార్కెట్ యార్డ్‌లో క్వింటాల్ కందులకు గరిష్ఠంగా 6,879, ఆముదాలు 6,353, వేరుశనగ 6,769, జొన్న 4,011, బొబ్బర్లు 5,656, మొక్కజొన్నలు 2,268, ఆర్ఎన్ఆర్ రకం వడ్లు 2,059, మినుములు 7,316 ధర పలికాయి. నేడు మొత్తంగా మార్కెట్ యార్డ్‌కు 132 మంది రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులు విక్రయానికి తీసుకొచ్చారు.

Similar News

News April 10, 2025

పాలమూరు: నేడు భారీ వర్షం.. ఎల్లో హెచ్చరిక జారీ

image

ఉమ్మడి MBNRజిల్లాలో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈమేరకు MBNR, NGKL జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. GDWL, NRPT, WNPలో మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఇటీవల పాలమూరులో పిడుగు పాటుకు ఒకేరోజు ఐదుగురు మరణించారు. జర జాగ్రత్త. SHARE IT

News April 10, 2025

బాలానగర్: రైలు ఢీకొని.. వృద్ధురాలు మృతి

image

రైలు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి రైల్వే ట్రాక్‌పై బుధవారం జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్వర్ వివరాల ప్రకారం.. పెద్దాయపల్లికి చెందిన బొట్టు మైసమ్మ (60) హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్తున్న రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. స్టేషన్ మాస్టర్ నర్సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

News April 10, 2025

MBNR: బెట్టింగ్‌కు యువత బలి కావద్దు: ఎస్పీ

image

మహబూబ్నగర్ జిల్లాలో ఎవరైనా క్రికెట్, ఇతర బెట్టింగ్‌లకు పాల్పడిన ప్రోత్సహించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ డి.జానకి హెచ్చరించారు. ఇటీవల సులభంగా డబ్బు సంపాదించాలని ఆలోచనతో యువత అధికంగా క్రికెట్ బెట్టింగ్ మోజులోపడి వారి బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా, మోసగాళ్ల మోసపూరితమైన ప్రకటనలు, సందేశాలకు యువత ఆకర్షితులై మోసపోతున్నారు. 100 డయల్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

error: Content is protected !!