News March 29, 2025
జనగామ: LRS చెల్లించాల్సింది రూ.లక్షల్లో.. చూపించింది రూ.కోట్లల్లో!

25% రాయితీతో LRS దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చింది. అయితే గడువు దగ్గర పడుతుండటంతో దరఖాస్తుదారులు LRS చెల్లించడానికి వెబ్ పోర్టల్ ఓపెన్ చేయగా.. రూ.లక్షల్లో కట్టాలన్సిన ఫీజు రూ.కోట్లలో చూపించడంలో ఒక్కసారిగా కంగుతున్నారు. పట్టణానికి చెందిన నరసింహ 132.86 చదరపు గజాలకు LRS ఫీజు చెల్లించేందుకు పోర్టల్ ఓపెన్ చేయగా రూ.1.11,92,567 చూపించడంతో షాక్ అయ్యాడు.
Similar News
News April 2, 2025
గాంధీ ముని మనవరాలు కన్నుమూత

మహాత్మా గాంధీ ముని మనవరాలు నీలంబెన్ పరీఖ్ (92) కన్నుమూశారు. గుజరాత్ నవ్సరిలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. తన తల్లికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, వయోభారంతోనే మరణించారని ఆమె కుమారుడు తెలిపారు. పరీఖ్ తన జీవితాంతం గిరిజన మహిళల విద్య కోసం కృషి చేశారు. పాఠశాలలు నిర్మించడంతో పాటు వారు వివిధ వృత్తులు చేయడానికి పాటుపడ్డారు.
News April 2, 2025
NLG: ట్యాంకర్లతో పంట రక్షణ

జిల్లాలో వరి చేలు చేతికొచ్చే దశలో భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపొతున్నాయి. దీంతో పంటలను కాపాడుకునేందుకు కొందరు రైతులు కొత్తగా బోర్లు వేస్తుండగా మరికొంత మంది గ్రామాల్లోని ట్యాంకర్ల ద్వారా నీటి తెచ్చి పంటలను కాపాడుకుంటున్నారు. ఇలా ప్రతి గ్రామంలో రైతులు ట్యాంకర్ల ద్వారా పంటలకు నీరు అందిస్తుండడంతో ట్యాంకర్ల యజమానులకు ఉపాధి లభిస్తోంది. వీరు ఒక్క ట్యాంకర్కు రూ.1000 వరకు తీసుకుంటున్నారని తెలిపారు.
News April 2, 2025
సిరిసిల్ల: భక్తులకు గుడ్ న్యూస్.. ఇంటి వద్దకే సీతారాముల కల్యాణ తలంబ్రాలు

ఆర్టీసీ కార్గో ద్వారా భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు ఆర్టీసీ చేసింది. ఒక్కొక్క ప్యాకెట్కు రూ.151, ఆన్లైన్ లేదా అన్ని బస్టాండ్ కార్గో సెంటర్లు, బుకింగ్ కోసం KNR 91542 98581, 9154298561, GDK 91542 98554, HSB 9154298673, HZB 9154298559, మంథని 9154298554, JGL 7780250439, KRTL 9154298572, MTPL 9154298574, SRCL 9154298576, VMD 9154298574 నంబర్లలో సంప్రదించవచ్చు.