News April 15, 2024

జనగామ: చౌరస్తాలో వీరంగం.. కర్రలతో దాడి.. ఒకరి మృతి

image

జనగామలో దారుణం జరిగింది. మతి స్థిమితం లేని ఓ వ్యక్తిపై ముగ్గురు యువకులు చౌరస్తాలో కర్రలతో దాడి చేశారు. స్థానికుల ప్రకారం.. కారు అద్దాలు పగలగొట్టాడని కళాధర్, కమలాకర్, చిర్ర కమలాకర్‌తో పాటు.. మరికొందరు భాస్కర్ అనే వ్యక్తిపై విచక్షణా రహితంగా కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్రగాయాలపాలైన అతడిని MGMకు తరలించగా.. చికిత్సపొందుతూ మృతి చెందాడు.

Similar News

News April 21, 2025

వరంగల్: మూడు జిల్లాల్లో విస్తరించిన ‘పాకాల’

image

పాకాల అభయారణ్యం అంటే ఒక్క వరంగల్ జిల్లానే అనుకుంటారు. నిజానికి పాకాల అడవి 839చ.కి.మీ విస్తీర్ణంతో వరంగల్‌తో పాటు మహబూబాబాద్, ములుగు జిల్లాలోనూ విస్తరించి ఉంది. వివిధ రకాల జంతువులు, పక్షులు, సరీసృపాలకు అనువైనదిగా ఉంది. శీతాకాలంలో విదేశీ పక్షులు సైతం ఇక్కడ సందడి చేస్తాయి. నర్సంపేటకు 9 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాకాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సందర్శకులు వస్తుంటారు.

News April 21, 2025

నాడు ‘పాకాల’.. నేడు ‘నర్సంపేట’

image

ప్రస్తుత నర్సంపేట నియోజకవర్గం 1956లో ఏర్పడింది. అంతకుముందు హైదరాబాద్ సంస్థానంలో ఈ ప్రాంతాన్ని పాకాల నియోజకవర్గంగా పేర్కొనేవారు. మొదట్లో పాకాల తాలూకాగా తర్వాత నర్సంపేటగా రూపాంతరం చెందింది. 1952లో పాకాల ఎమ్మెల్యేగా ఏ.గోపాలరావు గెలుపొందారు. 1957లో నర్సంపేట ఎమ్మెల్యేగా కనకరత్నమ్మ గెలిచారు. దీంతో నర్సంపేట అంటే పాకాల.. పాకాల అంటే నర్సంపేటగా ప్రత్యేక గుర్తింపు ఉంది.

News April 21, 2025

వరంగల్: Wow.. ఆరు తరాల సయింపు వంశీయుల ఆత్మీయ సమ్మేళనం

image

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం అనంతారానికి చెందిన సయింపు కుటుంబానికి చెందిన ఆరు తరాల రక్త సంబంధీకులు ఇటీవల ఒక ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఒకేచోట కలుసుకున్నారు. చదువు, ఉద్యోగ అవసరాల కారణంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వీరు.. కుటుంబ సమేతంగా పాల్గొని, ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించి ఆనందాన్ని పంచుకున్నారు. ఆత్మీయత, బంధుత్వం మరింత బలపడేలా ఈ సమావేశం కలిసొచ్చింది.

error: Content is protected !!