News February 24, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> ఫర్టిలైజర్ షాపులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
> అధికారం శాశ్వతం కాదు: ఎర్రబెల్లి
> రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
> జిల్లాలో సాగునీరు లేక ఎండిపోతున్న పంటలు
> పాలకుర్తి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు కలెక్టర్కు ఆహ్వానం
> చెరువులను నింపి నీళ్లు అందించాలి: ఎమ్మెల్యే పల్లా
> జిల్లాలోని పలు ఆలయాలలో శివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
Similar News
News December 16, 2025
ధనుర్మాసం ఆరంభం.. విష్ణుమూర్తికి పూజ చేస్తే!

విష్ణు భక్తులకు అత్యంత పవిత్రమైన ధనుర్మాసం నేటి నుంచి ప్రారంభమైంది. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మొదలవుతుంది. ఈ నెల రోజులు భక్తులు కఠిన నియమాలను పాటిస్తూ శ్రీమహావిష్ణువును ఆరాధిస్తారు. సూర్యోదయానికి ముందే పూజలు చేస్తుంటారు. దైవారాధనకు ఈ మాసం ఎంతో పవిత్రమైనది. కానీ శుభకార్యాలు మాత్రం అస్సలు చేయకూడదు. ధనుర్మాస వ్రతనిష్ఠతో విష్ణులోకప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.
News December 16, 2025
వరంగల్: లోకల్ పోరులో లోకల్ పొత్తులు!

3వ దశ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్నిచోట్ల కాంగ్రెస్, BJP బలపరచిన వాళ్లు ఒక్కటయ్యారు. శాయంపేట మండలంలో కాంగ్రెస్కు BRS అభ్యర్థి మద్దతు పలికారు. శాయంపేట పంచాయతీ బరిలో ఉన్న BRS అభ్యర్థి రమాదేవి బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి హై డ్రామాకు తెర తీశారు. ఇక్కడ కాంగ్రెస్, కాంగ్రెస్ రెబెల్ మధ్య పోటీ జరుగుతోంది. గీసుకొండ(M) కొమ్మాలలో BRS అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు తెలిపింది.
News December 16, 2025
విజయ్ దివస్.. యుద్ధ వీరులకు మోదీ, రాజ్నాథ్ నివాళులు

1971 ఇండియా-పాకిస్థాన్ యుద్ధంలో భారత్కు విజయాన్ని అందించిన సాయుధ దళాలను ‘విజయ్ దివస్’ సందర్భంగా PM మోదీ స్మరించుకున్నారు. ఇది దేశ చరిత్రలో గర్వించదగిన ఘట్టమని పేర్కొన్నారు. సైనికుల ధైర్యసాహసాలు, నిస్వార్థ త్యాగాలు దేశాన్ని కాపాడాయని, ఈ విజయం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని Xలో ట్వీట్ చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులు అర్పిస్తూ.. ఈ విజయం త్రివిధ దళాల సమన్వయానికి ప్రతీక అని అన్నారు.


