News March 17, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జనగామ: విజయవంతంగా కొనసాగిన సీఎం పర్యటన > దేవరుప్పుల: తాడి చెట్టు పై నుండి పడి గీత కార్మికుడు మృతి > జనగామలో ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి అక్కడికక్కడే మృతి > సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ నేతలు > సీఎం పర్యటన పలువురు నేతల ముందస్తు అరెస్ట్ > తూతూ మంత్రంగానే సీఎం పర్యటన ఉంది: తాటికొండ రాజయ్య > అక్రమ అరెస్టులను ఖండించిన సిపిఎం నేతలు > జిల్లా అధికారులను అభినందించిన కలెక్టర్
Similar News
News March 17, 2025
మిర్యాలగూడ: రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం దామరచర్లలో జరిగింది. NLG రైల్వే ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల శివారులో విష్ణుపురం-కొండ్ర పోల్ రైల్వే స్టేషన్ల మధ్య యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్కు వెళ్లే రైల్వే గేట్ వద్ద ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి ( సుమారు 45 ఏళ్లు ) రైలు కింద పడి మృతి చెందారు. మృతదేహాన్ని MLG ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
News March 17, 2025
గుర్లలో నకిలీ ఏసీబీ డీఎస్పీ బెదిరింపులు

గుర్ల మండలంలో పలువురు అధికారులను గుర్తు తెలియని ఓ నకిలీ ఏసీబీ అధికారి హడలెత్తించినట్లు సమాచారం. తాను ఏసీబీ DSPని అంటూ పరిచయం చేసుకొని డబ్బులు డిమాండ్ చేశాడు. పలువురు అధికారులకు ఆదివారం ఫోన్ చేసి మీరు అవినీతికి పాల్పడుతున్నారని, అరెస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగాడు. రూ.2లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని గుర్ల SI నారాయణరావు తెలిపారు.
News March 17, 2025
బంగ్లా, రోహింగ్యాల నెట్వర్క్పై దర్యాప్తునకు సిద్ధమైన హోంశాఖ

అక్రమ వలసదారులు, వారు స్థిరపడేందుకు సాయపడుతున్న వారిపై దర్యాప్తునకు కేంద్ర హోంశాఖ సిద్ధమైంది. ఇప్పటికే ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా బంగ్లాదేశీయులు, రోహింగ్యాల గుర్తింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. NIA, పోలీసులు చాలామందిని అరెస్టు చేసి డిటెన్షన్ క్యాంపులకు తరలించారు. అసలు వారెలా దేశంలో చొరబడ్డారు, వారికి ఎవరు సాయం చేశారు, గుర్తింపు పత్రాలు ఎవరు ఇప్పించారన్న కోణంలో దర్యాప్తు చేపట్టనున్నారు.