News February 12, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!
> కొడకండ్ల బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు > పాలకుర్తిలో ఎన్నికలపై రివ్యూ నిర్వహించిన డిసిపి> ప్రేరణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ > తీగారం దుర్గమ్మ ఆలయంలో చోరీ > ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధం టీపీసీసీ సభ్యులు అమృత రావు > కేటీఆర్ను కలిసిన తాటికొండ రాజయ్య > కేంద్ర నవోదయ విద్యాలయ సమితి కమిషనర్ ను కలిసిన ఎంపీ కడియం కావ్య.
Similar News
News February 12, 2025
ఒక్కో మహిళకు ప్రభుత్వం రూ.35వేలు ఇవ్వాలి: కవిత
TG: ప్రతి మహిళకు నెలకు ₹2,500 చొప్పున ఇస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని MLC కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయిందని, ఒక్కో మహిళకు సర్కార్ ₹35వేలు జమ చేయాలని అన్నారు. మహిళా దినోత్సవంలోపు ఈ హామీని నెరవేర్చకపోతే ప్రజాక్షేత్రంలో పోరాడతామని హెచ్చరించారు. కళ్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
News February 12, 2025
ప్రకాష్ నగర్ మున్నేరు వంతెనపై రాకపోకలు పునరుద్ధరణ
ఖమ్మం ప్రకాష్ నగర్ మున్నేరు వంతెనపై రాకపోకలను పునరుద్ధరించారు. గత సెప్టెంబర్ నెలలో వరదలకు దెబ్బతిన్న వంతెన మరమ్మతులు పూర్తి చేసి, మంగళవారం సాయంత్రం నుంచి వాహన రాకపోకలను అనుమతించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించి మాట్లాడుతూ.. వరదల సమయంలో ప్రకాష్ నగర్ వంతెన 9 పిల్లర్లు దెబ్బతిన్నాయని చెప్పారు. అధికార యంత్రాంగం ఆధునిక టెక్నాలజీ వినియోగించి పనులు పూర్తి చేసిందన్నారు.
News February 12, 2025
సినీ పరిశ్రమకు మేం వ్యతిరేకం కాదు: పుష్ప శ్రీవాణి
AP: విశ్వక్సేన్ ‘లైలా’ సినిమాకి తాము వ్యతిరేకం కాదని YCP నేత, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి తెలిపారు. తమపై జోకులు వేసే ఆర్టిస్టులకు మాత్రమే తాము వ్యతిరేకం అని, సినీ పరిశ్రమకు కాదని పేర్కొన్నారు. YCPపై జోకులు వేసే ఆర్టిస్ట్ నటించే ప్రతి సినిమాని బాయ్కాట్ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘టికెట్ కొనుక్కొని మరీ మా మీద మీతో జోకులు వేయించుకొనేంత పిచ్చి గొర్రెలం మాత్రం కాదు’ అని ట్వీట్ చేశారు.