News March 20, 2025

జనగామ: పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: డీఈవో

image

శుక్రవారం ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈవో రమేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మొత్తం 41 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, తాగునీటి వసతి, మూత్ర శాలలు, బెంచీలు, ఫ్యాన్లు, తదితర వసతులన్నీ కల్పించినట్లు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సర్వం సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

Similar News

News March 28, 2025

రూ.14 లక్షలు పలికిన ఒంగోలు గిత్త

image

ఉమ్మడి కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలోని డి.రంగాపురం గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి ఒంగోలు జాతి గిత్తను రూ.14 లక్షలకు విక్రయించారు. ప్రకాశం జిల్లా ముదిరముప్పాల గ్రామానికి చెందిన శేషాద్రి చౌదరి గిత్తను కొనుగోలు చేశారు. ఐదు సంవత్సరాల వయసు కలిగిన ఈ ఒంగోలు గిత్త ఎడ్ల పోటీల్లో సత్తా చాటుతోంది. ఇది వరకు పలు పోటీల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ స్థానాల్లో బహుమతులను గెలుపొందింది.

News March 28, 2025

సీతంపేట : మంచంపై నుంచి పడి విద్యార్థి మృతి

image

సీతంపేట మండలం దోనుబై ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న చలపతి శుక్రవారం మృతి చెందాడు. హాస్టల్‌లో తన బెడ్ నుంచి కిందికి దిగేప్పుడు కాలు జారిపడ్డాడు. ప్రమాదంలో చెవి భాగం వైపు గట్టిగా తగలటం వలన రక్తం రావటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తన తోటి స్నేహితులు చెప్తున్నారు. దోనుబై S.I ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిది కారెంకాగుమానుగడుగా సమాచారం.

News March 28, 2025

శ్రీశైల మహా క్షేత్రంలో పుష్పాలతో అలంకరణ

image

శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాల సందర్భంగా శుక్రవారం ధ్వజస్తంభం, ఆలయ ప్రాంగణంలో వివిధ పుష్పాలతో అలంకరణ ఘనంగా చేశారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర భక్తులు భారీ ఎత్తున శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు. ఆలయ అధికారులు భక్తుల రద్దీ సందర్భంగా వారికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

error: Content is protected !!