News January 31, 2025
జనగామ: రహదారి భద్రత నియమాలను పాటించాలి: కలెక్టర్

జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, ఏఎస్పీ పండారి చేతన్ నితిన్లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ రహదారి భద్రతపై జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారి భద్రతా ప్రమాణాలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
Similar News
News March 1, 2025
కౌలు రైతులకూ రూ.20 వేల సాయం

AP: ‘సూపర్ సిక్స్’ హామీల్లో భాగంగా ఈ ఏడాది నుంచి ‘అన్నదాత సుఖీభవ’ అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద రూ.20 వేలను భూమిలేని కౌలు రైతులకూ ప్రభుత్వం అందించనుంది. సాధారణంగా సాగు భూమి ఉన్న రైతులకు ‘పీఎం కిసాన్ యోజన’ కింద కేంద్రం ఏడాదికి రూ.6వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14వేలు ఇస్తుంది. దీన్ని కౌలు రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా, విధివిధానాలు త్వరలో రూపొందించనున్నారు.
News March 1, 2025
VJA: NCC సూపరింటెండెంట్ ఆత్మహత్యపై కుమార్తె ఆరోపణలు

విజయవాడ కృష్ణానదిలో ఈనెల 27న NCC సూపరింటెండెంట్ విజయలక్ష్మి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆమె కుమార్తె సాయి శ్రీ భవానిపురం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. తన తల్లి మరణానికి కారణం కమాండర్ బల్విందర్ సింగ్ అని తెలిపింది. బల్విందర్ సింగ్ తన తల్లిని అవహేళనగా మాట్లాడుతున్నాడని, గతంలో తనకు అనేకసార్లు తెలిపిందని, మనస్తాపనతో ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేసింది.
News March 1, 2025
ఆల్ ది బెస్ట్.. పరీక్షలు బాగా రాయండి: మంత్రి సత్యకుమార్

ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా ఎలాంటి ఒత్తిడికిలోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా మీ వెంట ఉంటాయని ట్వీట్ చేశారు. నిబద్ధత, క్రమశిక్షణ, అభ్యాసం ద్వారా ఈ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.