News February 2, 2025
జనగామ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ఆటో ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ధూలిమిట్ట మండలం కూటిగల్ గ్రామం రెడ్యా నాయక్ తండాకు చెందిన ధరావత్ విజయ్గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 14, 2025
ఆపదలో ఉంటే 100కు ఫోన్ చేయండి: SP

మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని అన్నారు. ఆపద సమయాల్లో అధైర్యపడకుండా వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలకు
ప్రశంసాపత్రాలు అందించారు.
News March 14, 2025
రాయపర్తి: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన వెంకన్న (38) చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ మత్స్యకారులతో కలిసి వెంకన్న గురువారం సాయంత్రం తాళ్లకుంటలోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వల కాళ్లకు చుట్టుకుని నీట మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్ కుమార్ వివరించారు.
News March 14, 2025
ఆరోగ్య శ్రీ.. ఐదేళ్ల పిల్లలకూ ‘కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ’

TG: ఆరోగ్య శ్రీ కింద ఇకపై ఐదేళ్ల వయసు పిల్లలకూ ‘కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ’ చేయనున్నట్లు ట్రస్ట్ CEO కర్ణన్ సర్క్యులర్ జారీ చేశారు. గతంలో 3yrs వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉండేది. పిల్లల్లో వినికిడి సమస్య నుంచి ఉపశమనం కలిగించేందుకు ఈ సర్జరీ చేస్తారు. దీని వల్ల వినికిడి సమస్య పూర్తిగా తొలగిపోనప్పటికీ కొంత ఉపశమనం ఉంటుంది. ప్రైవేటులో ఈ సర్జరీకి రూ.6-12లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు.