News February 1, 2025

జనగామ: విజయోస్తు స్మార్ట్ లెర్నింగ్ మెటీరియల్ ఆవిష్కరణ

image

జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులందరూ ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలనే ఆశయంతో పదవ తరగతి గణితం విజయోస్తు స్మార్ట్ లెర్నింగ్ మెటీరియల్‌ను శనివారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆవిష్కరించారు. ఈ స్టడీ మెటీరియల్‌ను ఉపయోగించుకొని గణితంలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. అలాగే జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని కోరారు.

Similar News

News February 2, 2025

MNCL: రోజూ 2.6లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలి: CMD

image

పెరుగుతున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రతిరోజు 2.6లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని సంస్థ CMD బలరాం ఆదేశించారు. శనివారం అన్ని ఏరియాల GMలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రోజుకు 11రేకులకు తగ్గకుండా బొగ్గు సరఫరా చేయాలన్నారు. బొగ్గు ఉత్పత్తి సాధనలో నాణ్యతకు, రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

News February 2, 2025

సంగారెడ్డి: ముగిసిన బడి బయట పిల్లల సర్వే

image

సంగారెడ్డి జిల్లాలో జనవరి 11 నుంచి సీఆర్పీలు, ఐఈఆర్పీలు నిర్వహించిన బడి బయట పిల్లల సర్వే శనివారంతో ముగిసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. బడి బయట పిల్లల సర్వేలో గుర్తించిన పిల్లల వివరాలను ప్రభంధ పోర్టల్ వెబ్సైట్‌లో నమోదు చేయాలని సీఆర్పీలకు, ఐఈఆర్పీలకు సూచించారు.

News February 2, 2025

జీవవైవిధ్య పరిరక్షణలో చిత్తడినేలల పాత్ర అద్వితీయం: మంత్రి సురేఖ

image

జీవ వైవిధ్య పరిరక్షణలో చిత్తడి నేలల పాత్ర అద్వితీయమైనదని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఫిబ్రవరి 2న చిత్తడినేలల (వెట్ ల్యాండ్స్) పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి తన భావాలను పంచుకున్నారు. చిత్తడి నేలలు జీవ వైవిధ్యానికి ఆలవాలంగా ఉన్నాయన్నారు. కాలుష్య తీవ్రత కారణంగా పర్యావరణ అసమతుల్యతతో తలెత్తే దుష్ప్రభావాలను అరికట్టడంలో, నీటినాణ్యతను పెంచడంలో చిత్తడి నేలలు వడపోత వ్యవస్థగా పనిచేస్తాయన్నారు.