News April 18, 2024
జనగామ: హత్య కేసులో ముగ్గురికి రిమాండ్
హత్య కేసులో ముగ్గురు నిందితులను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు. ఈ నెల 15న జనగామ ఆర్టీసీ చౌరస్తాలో పట్టణంలోని బాణాపురం వాసి బోయిని భాస్కర్ను కర్రలతో కొట్టి అతని మృతికి కారణమయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రఘునాథపల్లికి చెందిన కుర్ర కమలాకర్, కుర్ర కళాధర్, చిల్పూర్కు చెందిన చిర్ర శ్రవణ్ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News October 2, 2024
వరంగల్: మరికాసేపట్లో DSC సర్టిఫికెట్ వెరిఫికేషన్
వరంగల్ జిల్లాలో DSCలో SGT అభ్యర్థులు 1 :3నిష్పత్తిలో 435 మంది, SGT ఉర్దూలో 25 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్కు అర్హత సాధించారని డీఈఓ జ్ఞానేశ్వర్ తెలిపారు. బుధవారం ఉ.10 గంటల నుంచి సా. 5 గంటల వరకు GTలో 270 మంది, SGT ఉర్దూలో 25 మంది అభ్యర్థులు వెరిఫికేషన్కు రావాలన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో, రెండు సెట్లు గెజిటెడ్ తప్పనిసరన్నారు. వివరాలకు www.deowarangal.net సంప్రదించాలన్నారు.
News October 2, 2024
గీసుగొండ: బాలికపై వృద్ధుడి అత్యాచారం
గీసుగొండలో దారుణం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన 12ఏళ్ల బాలికపై సాంబయ్య (65) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి చనిపోగా అన్నదమ్ములతో కలిసి ఉంటోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. ఈ విషయం తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైద్యులు పరీక్షించి 4నెలల గర్భవతిగా నిర్ధారించారు. సాంబయ్యపై పోక్సో చేసు నమోదైంది.
News October 2, 2024
WGL: నేడు ఎంగిలిపూల బతుకమ్మ
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ప్రకృతితో మమేకమయ్యే సంబరం బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజులపాటు తొమ్మిది రకాల ప్రసాదాలను బతుకమ్మకు నివేదిస్తారు. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ అలంకరణ చేస్తారు. దీనికోసం రకరకాల పువ్వులు తీసుకొచ్చే బతుకమ్మగా పేరుస్తారు. ఈరోజు నువ్వులు, నూకలు లేదా బియ్యం, బెల్లంతో నైవేద్యం చేసి బతుకమ్మకు సమర్పిస్తారు.