News April 7, 2025
జన్నారం: ఐటీఐ పాసైన విద్యార్థులకు ఉద్యోగాలు

రాష్ట్ర ప్రభుత్వ సంస్థ తెలంగాణ ఓవర్సీస్ మన్ పవర్ కంపెనీ, టామ్కామ్ సహకారంతో వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జన్నారం ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ బండి రాములు సోమవారం మధ్యాహ్నం తెలిపారు. ఈ ఉద్యోగాల కోసం ఈనెల 8 జన్నారం ఐటీఐ కళాశాలలో 11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఐటీఐ చేసిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News April 12, 2025
ఇంటర్ ఫలితాల్లో పిడుగురాళ్ల విద్యార్థికి 978 మార్కులు

పిడుగురాళ్లలోని ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు. శనివారం విడుదల చేసిన సెకండియర్ ఫలితాల్లో యశ్వంత్ అనే విద్యార్థికి 978 మార్కులు వచ్చాయి. ఈ విద్యార్థి పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. తన తండ్రి కూలీ పని చేస్తుంటాడు. అనంతరం అధ్యాపకులు, తల్లిదండ్రులు ఆ విద్యార్థిని అభినందించారు.
News April 12, 2025
కృష్ణా: ఇంటర్ ఫలితాల్లో నాడు.. నేడు.. స్టేట్ ఫస్టే

ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా మళ్లీ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. మూడు సంవత్సరాలుగా ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలుస్తూ వస్తున్నారు. లాస్ట్ ఇయర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 84% ఫలితాలు రాగా ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 90% మంది ఉత్తీర్ణులయ్యారు. నేడు విడుదలైన ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో 85%, ద్వితీయ సంవత్సరంలో 93% మంది ఉత్తీర్ణులయ్యారు.
News April 12, 2025
9,970 ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం

రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మే 11 చివరి తేదీ. టెన్త్తోపాటు ITI, ఇంజినీరింగ్లో డిగ్రీ/డిప్లమా పూర్తిచేసి 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్ను బట్టి సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్/OBCలకు రూ.500, మిగతావారికి రూ.250గా ఉంది. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం <