News April 11, 2024

జన్నారం: కడుపునొప్పి భరించలేక మహిళా ఉద్యోగి మృతి

image

కడుపునొప్పి భరించలేక పురుగు మందు తాగి మహిళా మృతిచెందిన ఘటన జన్నారం మండలం మురిమడుగులో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకుల వివరాలిలా.. గద్దల నవ్య (28 ) ఉట్నూర్ RDO కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తోంది. గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. బుధవారం నొప్పి తీవ్రమవ్వడంతో బాధ భరించలేక పురుగు మందు తాగింది. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతిచెందింది.

Similar News

News February 1, 2025

ఆదిలాబాద్ అడవుల్లో హైనా సంచారం

image

దట్టమైన అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే క్రూర మృగం హైనా ఆదిలాబాద్ జిల్లా మావల అడవుల్లో సంచరించడం కలకలం రేపుతోంది. అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో హైనా దృశ్యాలు రికార్డయ్యాయి. మావల హరితాహారం లోని సీసీ కెమెరాల్లో ఈ చిత్రం శుక్రవారం కనిపించింది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. జిల్లాలో కొన్ని సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన హైనాలు తిరిగి మావల అడవుల్లో కనిపించిందన్నారు.

News February 1, 2025

జాతీయస్థాయి పోటీల్లో ADBకు 10 పతకాలు

image

జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చి పతకాలు సాధించినట్లు తైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శివప్రసాద్, వీరేష్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ ఇండోర్ స్టేడియంలో జనవరి 27 నుంచి 30వ వరకు పోటీలు జరిగినట్లు పేర్కొన్నారు. జిల్లాకు 2 స్వర్ణ, 3 వెండి, 5 రజత పతకాలు వచ్చాయన్నారు.

News February 1, 2025

శ్యాంపూర్‌లో పర్యటించిన మంత్రి సీతక్క

image

ఉట్నూర్ మండలం శ్యాంపూర్‌లో రాష్ట్రమంత్రి సీతక్క శుక్రవారం పర్యటించారు. గ్రామంలో కొలువుదీరిన దైవం బుడుందేవ్‌ను ఆమె శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే బొజ్జు, ఎమ్మెల్సీ విఠల్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లేష్, మాజీ ఎంపీ సోయం బాపురావు ఉన్నారు.