News June 28, 2024
జమ్మలమడుగులో పెళ్లికి వెళ్లి వస్తుండగా వ్యక్తి మృతి
ముద్దనూరు ప్రధాన రహదారిలోని చిటిమిటి చింతల గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాలు మేరకు.. ముద్దనూరు మండలం చింతకుంట గ్రామానికి చెందిన మార్క్ (49) మృతిచెందాడు. బైక్ పై వివాహానికి వెళ్లి వస్తుండగా చిటిమట్టి చింతల వద్ద ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై ఏఎస్ఐ మురళి యాదవ్ కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News October 7, 2024
అన్నమయ్య: పిడుగు పడి ఇద్దరు కూలీలు మృతి
పిడుగు పడి ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందిన ఘటన సోమవారం అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సంబేపల్లి మండలం సోమవరం గ్రామం బావులకాడపల్లి జగనన్న కాలనీ సమీపంలోని వ్యవసాయ పొలంలో, పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 7, 2024
కడప – చెన్నై జాతీయ రహదారిపై తప్పిన ఘోర ప్రమాదం
పుల్లంపేట మండలం జాగువారి పల్లి వద్ద కడప – చెన్నై జాతీయ రహదారిపై సోమవారం ఉదయం కారు – లారీ ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న సింహాద్రిపురం, చింతకొమ్మదిన్నె ఎస్సైల భార్యలకు స్వల్ప గాయాలయ్యాయి. మరో లారీ డీజిల్ ట్యాంకర్ను ఢీ కొట్టడంతో సుమారు 600 లీటర్లు డీజిల్ రోడ్డుపై పడింది. పొరపాటున మంటలు చెలరేగి ఉంటే ఘోర ప్రమాదమే జరిగి ఉండేది. ఘటన స్థలానికి పుల్లంపేట పోలీసులు చేరుకొని పరిశీలిస్తున్నారు.
News October 6, 2024
దువ్వూరు: శవమై తేలిన తప్పిపోయిన రెండేళ్ల బాలుడు
దువ్వూరుకు చెందిన తంగేడు పల్లె సాయికుమార్ కుమారుడు అమర్(2) ఈనెల 3న ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయాడు. ఆ సమయంలో బాలుడి ఆచూకి కోసం తల్లిదండ్రులు దువ్వూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల తర్వాత బాలుడు కేసి కాలువలో శవమై తేలాడు. బాలుడు మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.