News March 14, 2025
జయ కేతనం సభలో ఆకట్టుకున్న ప్రదర్శన

చిత్రాడలో జనసేన జయకేతనం సభ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కర్ణాటక జానపద నృత్యం ‘డొల్లు కుణిత’ కళాకారుల ప్రదర్శన విశేషంగా అలరించింది. అంతకుముందు వీర మహిళలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాసేపటి క్రితమే జనసేనాని పవన్ కళ్యాణ్ సభా వేదిక వద్దకు చేరుకున్నారు.
Similar News
News March 15, 2025
ధనికులుగా మారేందుకు హర్ష్ గోయెంకా చిట్కాలు

ఆర్థిక క్రమశిక్షణతో ధనికులుగా మారేందుకు వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా Xలో చెప్పిన టిప్స్ వైరలవుతున్నాయి.
* సంపదను సృష్టించే ఆస్తులను సంపాదించండి
* సంపాదించే దాని కన్నా తక్కువ ఖర్చు చేయండి
* ఆదాయంతో పాటు సంపదను సృష్టించడంపై దృష్టి పెట్టండి
* ఆర్థిక ఐక్యూను మెరుగుపరచుకొండి
* సంపదను పెంచే అవకాశాలను చూడండి
* మనీ కోసమే కాకుండా నేర్చుకునేందుకు పనిచేయండి
News March 15, 2025
గ్రూప్-3లో బజార్హత్నూర్ వాసికి 74వ ర్యాంక్

గ్రూప్-3 ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఇందులో బజార్హత్నూర్ మండలానికి చెందిన బిట్లింగ్ లక్ష్మమన్, నీల దంపతుల కుమారుడు ఉదయ్ కుమార్ 74వ ర్యాంక్ సాధించారు. ఇటీవల గ్రూప్-2 లో ఫలితాల్లో సైతం ఉదయ్ కుమార్ సత్తా చాటాడు. పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఆయనకు కుటుంబ సభ్యులతో పాటు మండల వాసులు అభినందనలు తెలిపారు.
News March 15, 2025
మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని వ్యక్తి సూసైడ్

మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వలేదని చిన్న రామయ్య(30) ఇంట్లో ఉన్న ఫినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కొలిమిగుండ్ల మండలం బెలుంలో శుక్రవారం చోటుచేసుకుంది. చిన్నరామయ్య ప్రతిరోజూ మద్యం తాగేవాడు. శుక్రవారం మద్యానికి భార్య శోభను డబ్బులు అడగగా.. ఆమె ఇవ్వలేదు. దీంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కొలిమిగుండ్ల సీఐ రమేశ్ బాబు వెల్లడించారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.