News February 12, 2025

జహీరాబాద్: జల వాగులో మహిళ మృతదేహం లభ్యం

image

జహీరాబాద్ నియోజకవర్గంలోని గొల్యాల హద్నూర్ గ్రామ శివారులోని జల వాగులో గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యమైనట్లు జహీరాబాద్ రూరల్ సీఐ జుక్కల్ హనుమంతు తెలిపారు. మహిళా వయసు 45- 50 ఏళ్లు ఉంటాయని, ఒంటిపై నల్లటి శెట్టర్, పసుపు రంగు పట్టుచీరతో ఉన్న మహిళ మృతదేహం వాగులో కొట్టుకొచ్చినట్లు ఉందని తెలిపారు. నాలుగు రోజుల క్రితం చనిపోయి ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News February 12, 2025

HYD: అలా చేస్తే క్యాన్సర్ వ్యాధికి చెక్ పడినట్లే..!

image

జీవనశైలి మార్చుకుంటే 30% క్యాన్సర్లకు దూరంగా ఉండొచ్చని HYD పంజాగుట్ట NIMS ఆసుపత్రి డాక్టర్ సదాశివుడు తెలిపారు. రోజూ వ్యాయామం, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, నట్స్ ఆహారంలో భాగంగా చేసుకోవాలని, మహిళలు ఏడాదికి ఒకసారి మమ్మోగ్రఫీ, పాప్‌స్మియర్ టెస్టులు చేయించుకోవాలని డాక్టర్ సూచించారు. ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు.

News February 12, 2025

HYD: నిలోఫర్ డాక్టర్లు.. మీరు GREAT

image

ప్రాణాపాయ స్థితిలో ఉన్న 27 వారాల గర్భవతి వి.కవిత(35)కి HYD నీలోఫర్ వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. కవిత VKB జిల్లా వాసి కాగా.. ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుంది. మూత్రాశయం మీద ఉన్న చీలికలని వైద్యులు సరి చేశారు. 1KG మగ శిశువుకు జన్మనిచ్చింది.  ఈ క్రమంలో భారీగా రక్తం అవసరం పడిందని నిలోఫర్ సూపరింటెండెంట్ డా.రవి కుమార్ తెలిపారు. డాక్టర్లను మంత్రి రాజనర్సింహ అభినందించారు.

News February 12, 2025

తణుకు: బర్డ్‌ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలు ఇవే…!

image

బర్డ్‌ ఫ్లూ వైరస్‌ సోకిన తణుకు మండలం వేల్పూరులో కోళ్లఫారం నుంచి 10 కిలోమీటర్లు విస్తీర్ణంలో ఇన్‌ఫెక్టెడ్‌ ప్రాంతాలుగా అధికారులు ప్రకటించారు. తణుకు మండలంలోని తణుకుతోపాటు కొమరవరం, యర్రాయిచెరువు, మండపాక, తేతలి, ఇరగవరం మండలం ఇరగవరం, కావలిపురం, రేలంగి, అర్జునుడుపాలెం, అత్తిలి మండలంలో గుమ్మంపాడు, పాలి, బల్లిపాడు, పెనుమంట్ర మండలం మల్లిపూడి గ్రామాలను ప్రకటించారు. చికెన్, గుడ్లు అమ్మకాలను నిలిపివేశారు.

error: Content is protected !!