News March 17, 2025

జియ్యమ్మవలసలో ఏనుగులు గుంపు సంచారం

image

జియ్యమ్మవలస మండలం నందివాని వలస, తోటపల్లి, సింగాణపురం గౌరీపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి చెరకు, అరటి తోటల్లో ఏనుగుల గుంపు సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ.. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయవద్దని, రైతులు పొలాలకు వెళ్లొద్దని సూచించారు. 

Similar News

News March 17, 2025

గద్వాల: ప్రజావాణికి 30 ఫిర్యాదులు

image

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయములోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది తమ సమస్యల పరిష్కరం కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు.

News March 17, 2025

కృష్ణా: ‘టెన్త్ పరీక్షలకు యూనిఫామ్ అనుమతి లేదు’

image

పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ అనుమతి లేదని (గవర్నమెంట్ ఎగ్జామ్స్) అసిస్టెంట్ కమిషనర్ ఎమ్ డేవిడ్ రాజు తెలిపారు. సోమవారం స్వతంత్ర పురం జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన ఘటనపై యూనిఫామ్ అనుమతి ఉందా, లేదా అన్న విషయంపై (ఎమ్ డేవిడ్ రాజును పాత్రికేయులు వివరణ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరీక్షా సమయంలో యూనిఫామ్ అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు.

News March 17, 2025

సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన క్రైమ్స్ డీసీపీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన క్రైమ్స్ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన బి.జనార్దన్ సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలుసి మొక్కను అందజేశారు. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీల నియంత్రణకై తీసుకోవాల్సిన ముందస్తూ చర్యలు, అలాగే పెండింగ్ ఉన్న చోరీ కేసులను త్వరగా పరిష్కరించడంతో పాటు నిందితులను పట్టుకోవడం కోసం పోలీస్ కమిషనర్ క్రైమ్ డీసీపీ పలు సూచనలు చేశారు.

error: Content is protected !!