News May 24, 2024

జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు

image

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం జరిగే మొదటి సంవత్సరానికి పరీక్షకు గాను జిల్లా వ్యాప్తంగా 35 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆర్ఐఓ గురవయ్య శెట్టి తెలిపారు. 15,981 విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు.

Similar News

News October 12, 2024

కర్నూలు జిల్లాలో మద్యం షాపులకు 5,128 దరఖాస్తులు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులకు దరఖాస్తు గడువు శుక్రవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,128 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లాలో 99 దుకాణాలకు 3,013 దరఖాస్తులు రాగా, నంద్యాల జిల్లాలో 105 దుకాణాలకు 2,115 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 14న కర్నూలు జడ్పీ సమావేశ హాల్‌లో లక్కీ డిప్ తీయనున్నారు.

News October 12, 2024

హొళగుంద: దేవరగట్టులో నేడు కర్రల సమరం

image

ఇరు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన దేవరగట్టు కర్రల సమరం దసర సందర్భంగా శనివారం జరగనుంది. మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం అనంతరం జరిగే బన్ని ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని స్థానికులు తెలిపారు. బన్ని ఉత్సవాల్లో మూడు గ్రామాలు ఒక వైపు మరో ఏడు గ్రామాలు ఒకవైపు నుంచి తలపడుతాయి. కాగా కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

News October 11, 2024

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 13 నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.