News February 25, 2025

జిల్లాకు చేరుకున్న ప్రశ్న పత్రాలు

image

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాలు జిల్లా కేంద్రానికి చేరాయి. రాష్ట్ర విద్యాశాఖ నుంచి ప్రత్యేక వాహనంలో పకడ్బందీ బందోబస్తు నడుము ప్రశ్నపత్రాలను జిల్లా కేంద్రానికి పంపారు. వీటిని కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మార్చి 5 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి

Similar News

News February 25, 2025

జీమెయిల్ లాగిన్‌కు త్వరలో క్యూఆర్ కోడ్ విధానం?

image

జీమెయిల్ లాగిన్‌కు సంబంధించి SMS కోడ్ స్థానంలో క్యూఆర్ కోడ్‌లను తీసుకురావాలని గూగుల్ యోచిస్తున్నట్లు సమాచారం. మెయిల్ సెక్యూరిటీ కోసం ప్రస్తుతం SMS బేస్డ్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను గూగుల్ అమలు చేస్తోంది. దీనితో పోలిస్తే క్యూఆర్ కోడ్ విధానం మరింత భద్రతనిస్తుందని సంస్థ భావిస్తోంది. ఈ కోడ్‌లను స్కాన్ చేయడానికి స్మార్ట్ ఫోన్లలోని కెమెరా యాప్‌‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.

News February 25, 2025

విద్యార్థులతో పనులు చేయించొద్దు: బాలల హక్కుల కమిషన్

image

AP: వసతి గృహాల్లో విద్యార్థులతో ఏ రకమైన <<15559875>>పనులు <<>>చేయించినా సిబ్బందిపై చర్యలు తప్పవని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ అప్పారావు హెచ్చరించారు. విద్యార్థులతో వంట, పరిశుభ్రత పనులు, టాయిలెట్స్ క్లీనింగ్, నీళ్లు తెప్పిస్తున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులపై ఎలాంటి మానసిక, శారీరక ఒత్తిడి లేకుండా చూడాలన్నారు.

News February 25, 2025

గుమ్మడిదల: మేము ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం: జేఏసీ

image

గుమ్మడిదల మండలంలో చేపట్టిన డంప్ యార్డు రద్దును చేయకపోవడంతో నిరసనగా పార్టీలు, రాజకీయాలకు తీతంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్లు జేఏసీ పేర్కొంది. నేటికీ 21వ రోజు డంప్ యార్డ్‌కి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వం, అధికారుల నుంచి ఏలాంటి స్పందన లేదన్నారు. దీంతో 27న జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనడం లేదని వారు స్పష్టం చేశారు.

error: Content is protected !!