News February 28, 2025

జూపార్కు ధరలు పెంపు.. రేపటి నుంచి అమల్లోకి

image

HYD నెహ్రూ జూలాజికల్ పార్కు ప్రవేశ టికెట్లతో పాటు అన్ని రకాల టికెట్లపై ధరలను రాష్ట్ర అటవీ శాఖ ఆదేశాల మేరకు జూపార్క్ అధికారులు పెంచారు. రేపటి నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయని జూపార్క్ క్యూరేటర్ వసంత తెలిపారు. 2 ఏళ్ల తర్వాత జూ పార్క్ టికెట్ల ధరలను పెంచారు. జూపార్క్ ప్రవేశ టికెట్ రూ.100, చిన్న పిల్లలకు రూ.50లతో పాటు జూలోని మరిన్నింటికి ధరలు పెంచారు.

Similar News

News February 28, 2025

HYD: కేంద్రమంత్రికి సీఎం బహిరంగ లేఖ

image

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి 9 పేజీలతో లేఖ రాశారు. పలు ప్రభుత్వ విజ్ఞప్తులను సీఎం లేఖలో ప్రస్తావించారు. అందులో కీలకంగా తెలంగాణను కేంద్రం పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి నిధుల మంజూరు బాధ్యత కిషన్ రెడ్డిదేనన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉండగానే చెన్నై, బెంగళూరు మెట్రో విస్తరణకు ఆమోదం వచ్చిందని హైదరాబాద్ మెట్రో విస్తరణకు పలు విజ్ఞప్తులను పట్టించుకోలేదని వెల్లడించారు.

News February 28, 2025

HYDలో భవాన నిర్మాణ పర్మిషన్లు ఈజీ

image

GHMC పరిధిలో ఇక నుంచి ఇంటి నిర్మాణాల పర్మిషన్లు వేగంగా జరుగుతాయని కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. దీనికోసం ‘బిల్డ్ నౌ’ యాప్ తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై జోనల్, డిప్యూటీ కమిషనర్‌లకు మార్చి 9 వరకు శిక్షణ ఇస్తున్నారు. మార్చి 10 నుంచి పూర్తిగా అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. AI ఆధారంగా పనిచేయడంతో ఇందులో ప్లాన్ అప్లోడ్ చేస్తే లోపాలు, కోర్టు కేసులు అన్నింటిని గుర్తిస్తుందని వివరించారు.

News February 28, 2025

HYD: కాళోజీ అవార్డు గ్రహీత జయరాజు పదవీ విరమణ

image

బజార్ ఘాట్‌లోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ భవన్‌లో సింగరేణి కార్మికుడు, ప్రముఖ కవి, సినీగేయ రచయిత, కాళోజీ అవార్డు గ్రహీత, తెలంగాణ ఉద్యమకారుడు జయరాజు పదవీ విరమణ జరిగింది. ఈ పదవీ విరమణ సభకు ముఖ్యఅతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అభినందనలు తెలిపారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు శాలువాతో సన్మానించారు.

error: Content is protected !!