News September 10, 2024
జూరాల 26 గేట్లు ఎత్తివేత
జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో ఆల్మట్టి డ్యాం పూర్తిస్థాయిలో నిండిపోవడంతో దిగువకు రెండు లక్షలకు పైగా వరద నీరు వదలడంతో జూరాల ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు డ్యాం 26 గేట్లు ఎత్తి 2 లక్షల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. నది తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Similar News
News September 30, 2024
ఇంటర్ ప్రవేశాల గడువు అక్టోబర్ 15 వరకు పొడిగింపు
2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో ప్రవేశాల గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు వనపర్తి డిఐఈఓ అంజయ్య ఆదివారం తెలిపారు. ప్రైవేటు జూనియర్ కళాశాలలో రూ.500 జరిమానాతో, ప్రభుత్వ కళాశాలలో ఫైన్ లేకుండా అక్టోబర్ 15 వరకు ఇంటర్ లోప్రవేశం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించిందని అన్నారు.
News September 30, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!
❤U-19 టోర్నీ.. నల్గొండ పై పాలమూరు ఘనవిజయం
❤ధన్వాడ: 3 నుంచి రెజ్లింగ్ పోటీలు
❤3 నుంచి ఓపెన్ SSC,INTER సప్లిమెంటరీ పరీక్షలు
❤బిజినపల్లి:లంచం తీసుకున్న కానిస్టేబుల్ సస్పెండ్
❤కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల జులై వేతనాలు విడుదల
❤నవోదయ దరఖాస్తు గడువు పొడిగింపు
❤మద్యం సేవించి వాహనాలు నడపరాదు:SIలు
❤ప్రధాని మోదీ పేదల వ్యతిరేకి:CPM
❤వ్యవసాయ కార్మికులకు రూ.12 వేలు వెంటనే ఇవ్వాలి:BKMS
News September 30, 2024
జాగ్రత్త..ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న గుండె సమస్యలు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు రోజురోజుకు పెరుగుతున్నారు. గతంలో 50 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చేది. నేటి జీవనశైలితో 20-70 ఏళ్ల వారికి గుండెపోటు వస్తోంది.100 మంది రోగుల్లో 70% మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కరోనా తర్వాత గుండె సమస్యలు పెరిగాయని, చికెన్, మసాలాతో కూడిన ఆహారం తినరాదని నిపుణులు తెలిపారు. నేడు వరల్డ్ హార్ట్ సందర్భంగా ప్రత్యేక కథనం.