News April 6, 2025
‘జై శ్రీరాం’: నేడు హైదరాబాద్లో ఒకటే స్లోగన్

శ్రీ రామ నవమి వేడుకలకు హైదరాబాద్ ముస్తాబైంది. సీతారాంబాగ్ టెంపుల్, ఆకాశ్పురి హనుమాన్ టెంపుల్ నుంచి భారీ శోభాయాత్రలకు సర్వం సిద్ధమైంది. హనుమాన్ టేక్డీ వద్ద ఈ యాత్ర ముగుస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిటీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఇక అన్ని రామాలయాల్లో కళ్యాణానికి ముహూర్తం పెట్టారు. నేడు ‘జై శ్రీరాం’ నినాదాలతో హైదరాబాద్ హోరెత్తనుంది.
Similar News
News April 9, 2025
HYD: అక్కడ అన్ని పుస్తకాలు చవక..!

HYDలోని సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ నాంపల్లి గ్రౌండ్లో పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. ఏప్రిల్ 17వ తేదీ వరకు కొనసాగుతుందని, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. సాహిత్యం, నాట్యం, సంగీతం, జీవితచరిత్రలు, ఆదివాసి జీవన విధానం, అనేక పరిశోధన గ్రంథాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
News April 9, 2025
దిల్సుఖ్నగర్లో బాంబ్ బ్లాస్ట్కు వేరే దగ్గర ప్లాన్

దిల్సుఖ్నగర్ <<16034773>>బాంబ్ బ్లాస్ట్<<>> ఘటనలో నిందితులకు నిన్న హై కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే ఉగ్రవాదులు ముందుగా స్థానికంగా మిర్చి సెంటర్, మద్యం దుకాణాన్ని టార్గెట్ చేయగా సమయం మించిపోతుండడంతో వఖాస్ బాంబుతో సైకిల్ని 107 బస్టాప్ వద్ద వదిలేసి వెళ్లాడు. దీనికి ముందు లుంబినీ పార్క్ వద్ద పేలిన బాంబ్ను కూడా హుస్సేన్సాగర్లో పెట్టాలని ప్లాన్ చేశారు. సమయం మించిపోవడంతో లేజేరియం వద్ద వదిలేసి వెళ్లాడు.
News April 9, 2025
మొయినాబాద్లో ముజ్రా పార్టీ భగ్నం

మొయినాబాద్లో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఏడుగురు యువతులు, 14 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాలిడే ఫామ్ హౌస్లో తెల్లవారుజామున SOT పోలీసులు దాడులు నిర్వహించి మద్యం బాటిళ్లతో పాటు 70 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్, ముంబైతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకొచ్చి అర్ధనగ్నంగా డాన్సులు చేయించిన్నట్లు సమాచారం.