News July 12, 2024
జైపూర్: ఉరివేసుకొని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

జైపూర్ మండలం మిట్టపల్లిలోని కొమ్ముగూడెనికి చెందిన డిగ్రీ విద్యార్థిని సెగ్యం భాగ్యలక్ష్మి (18) గ్రామ సమీపంలోని మామిడి తోటలో గురువారం రాత్రి చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సెగ్యం రమేశ్-శ్రీలత దంపతుల కూతురుభాగ్యలక్ష్మి జిల్లా కేంద్రంలో డిగ్రీ చదువుతుంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ శ్రీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 14, 2025
ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఆదిలాబాద్ SP

ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు SP అఖిల్ మహాజన్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సూచనలు చేశారు.★ వాహనాలు నడిపే వారిపై రంగులు చల్లుతూ ఇబ్బందులు కలిగించకూడదు★ ఇతరుల అనుమతి లేకుండా రంగులను పూయరాదు★ మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు★ సహజసిద్ధమైన రంగులను ఉపయోగించడం శ్రేయస్కరం★ జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు
News March 14, 2025
ఆదిలాబాద్: వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్

విద్యా శాఖ కార్యదర్శి (FLN) విద్యార్థుల్లో అభ్యాస సామర్థ్యాలను బలోపేతం చేసే అంశంపై గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో, విద్యాధికారులతో, నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. AI ఆధారిత పరిజ్ఞానంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులో వెనుకబడి ఉన్న విద్యార్ధులకు సులువుగా శ్రద్ధతో చదవడానికి పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు.
News March 14, 2025
ADB: BRAOU సెమిస్టర్-1 హాల్ టికెట్లు విడుదల

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ సెమిస్టర్-1 హాల్ టికెట్లు బుధవారం విడుదల అయ్యాయి. అయితే దీనికి సంబంధించి హాల్ టికెట్లు విద్యార్థులు www.braouonline.in అఫీషియల్ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఇప్పటికే అభ్యర్థులకు రిజిస్టర్ ఫోన్ నంబర్లకు మేసేజ్లు పంపినట్లు తెలిపారు.