News March 17, 2025

జోగులాంబ గద్వాల జిల్లా ముఖ్య వార్తలు

image

జోగులాంబ :@ధరూర్ : LOC అందజేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల.
@ఇటిక్యాల :RTC బస్సులను నిలపాలని వినతి.
@ఉండవెల్లి : మారమునగాలలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్.
@రాజోలి : యాసంగి పంటలకు సాగునీటిని విడుదల చేయాలి.
@అలంపూర్ : మటన్ షాపులకు భారీగా పెరిగిన విక్రయాలు.
@ జిల్లాలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
@అయిజ: స్నేహితుడి వైద్యానికి ఆర్థిక సహాయం అందించారు.
@గద్వాల : ప్రజా సమస్యలను పరిష్కరించండి.సిపిఎం

Similar News

News March 17, 2025

జగిత్యాల: జిల్లాలో కొనసాగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు

image

జగిత్యాల జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఆదివారం అత్యధికంగా మల్లాపూర్, అల్లీపూర్‌లో 40.9℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు వెల్గటూర్ 40.8, గొదురు, సిరికొండ, రాఘవపేట, గొల్లపల్లి 40.6, సారంగాపూర్ 40.5, రాయికల్, ఐలాపూర్ 40.3, జైన 40.2, మారేడుపల్లి 40.0, గుల్లకోట 39.9, మెట్‌పల్లి 39.7, జగ్గసాగర్ 39.4, నేరెల్ల 39.3, కథలాపూర్ 39.2, కోరుట్ల, మేడిపల్లిలో 39.1℃ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 17, 2025

ఏలూరు : ‘ఒక్కనిమిషం..వారి గురించి ఆలోచిద్దాం’

image

మరి కాసేపట్లో ఏలూరు జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 133 కేంద్రాలలో 25,179 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నిర్వహణకు 62 మంది కస్టోడియన్లు, 1,120 మంది ఇన్విజిలేటర్లు సిద్ధంగా ఉన్నారు. అయితే పరీక్షా కేంద్రాల వద్దకు టెన్షన్ టెన్షన్ గా చేరుకుంటున్న విద్యార్థుల కోసం ఒకసారి ఆలోచిద్దాం. వీలైతే వారిని పరీక్షా కేంద్రాల వద్దకు చేర్చి మన వంతు సాయం చేద్దాం.

News March 17, 2025

జగిత్యాల: పొలంలో మంచెలు.. అవే రక్షణ కంచెలు..!

image

పొలంలో మంచెలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పల్లెటూర్లు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు గుట్టల ప్రాంతాల్లో అడవి జంతువుల దాడి నుంచి తమను తాము రక్షించుకోవడానికి, పక్షులు, జంతువుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి ఇలాంటి మంచెలు నిర్మించుకుంటారు. పట్టణంలోని ఏసీ రూములను తలపించే ఇలాంటి మంచెల్లో సేద తీరితే వచ్చే ఆనందమే వేరని పల్లెటూరి వాసులు, ప్రకృతి ప్రేమికులు అంటుంటారు.

error: Content is protected !!