News June 17, 2024
టీడీపీలోకి వెళ్లడంపై స్పందించిన ఆలూరు ఎమ్మెల్యే
ఎమ్మెల్యేగా గెలిపించిన జగన్ను కాదని పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆలూరు ఎమ్మెల్యే విరూఫాక్షి స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్లడానికి తన ఆత్మసాక్షి ఒప్పుకోదని పేర్కొన్నారు. పార్టీ మారుతున్నట్లు పత్రికల్లో వస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. వదంతులు నమ్మెుద్దని ప్రజలను కోరారు.
Similar News
News October 3, 2024
నంద్యాల జిల్లాలో హత్య.. అనుమానమే కారణం!
కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లిలో హత్య జరిగిన విషయం తెలిసిందే. స్థానికుల సమాచారం మేరకు.. భార్య పార్వతిని భర్త రామమోహన్ గొడ్డలితో నరికి చంపాడు. వీరికి వివాహమై 16ఏళ్లు కాగా కొద్దిరోజులుగా భర్త భార్యకు దూరంగా ఉన్నాడు. ఇటీవల మళ్లీ ఆమె వద్దకు వచ్చిన ఆయన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ గొడవలు పడేవారు. ఇవాళ తెల్లవారుజామున భార్య నిద్రపోతుండగా నరికి హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
News October 3, 2024
నంద్యాల జిల్లాలో మహిళ హత్య
నంద్యాల జిల్లాలో మరో దారుణ హత్య జరిగింది. కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లిలో ఓ భర్త భార్యను కిరాతకంగా చంపాడు. భార్యపై అనుమానంతో గొడ్డలితో నరికి చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 3, 2024
శ్రీగిరిలో నేటి నుంచి దసరా ఉత్సవాలు
శ్రీశైల క్షేత్రంలో దసరా నవరాత్రి మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు శైలపుత్రి అలంకారంలో భ్రమరాంబాదేవి అమ్మవారు దర్శనమిస్తారు. శరన్నవరాత్రులలో స్వామివారికి అభిషేకాలు, అమ్మవారి కుంకుమార్చనలు మినహా మిగిలిన ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. వాహనసేవలను సామాన్య భక్తులు వీక్షించేలా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. వాహన సేవలు, గ్రామోత్సవం, తెప్పోత్సవాలను భక్తులు <