News February 28, 2025
టెన్త్ పరీక్షలను పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్

మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని కలెక్టర్ పి.రంజిత్ బాషా చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి సి.ఎస్.లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు.
Similar News
News March 1, 2025
టెన్త్ పరీక్షలను పక్కాగా నిర్వహించాలి: కర్నూలు కలెక్టర్

మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని కలెక్టర్ పి.రంజిత్ బాషా చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి సి.ఎస్.లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు.
News February 28, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ టెన్త్ పరీక్షలను పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్➤ అశేష జనవాహిని నడుమ సిద్ధరుఢ స్వామి రథోత్సవం➤మంత్రాలయం శ్రీ మఠంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి➤ రేపు మంత్రాలయానికి మంత్రి నారా లోకేశ్ రాక➤ ఎమ్మెల్యేపై వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ ఫైర్➤ దేవనకొండ: తాను చదువుకున్న పాఠశాలకు రిటైర్డ్ ఐపీఎస్ విరాళం➤ పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తాం: కర్నూల్ కలెక్టర్
News February 28, 2025
రేపు మంత్రాలయానికి నారా లోకేశ్

మంత్రి నారా లోకేశ్ రేపు మంత్రాలయం రానున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం ఆయన వస్తుండటంతో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ ప్రాంగణం, గెస్ట్ హౌస్, ఆలయ ప్రాంగణాన్ని ఎస్పీ పరిశీలించారు. లోకేశ్ పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.