News March 13, 2025

ట్యాంక్ పైనుంచి దూకి యువకుడి సూసైడ్

image

సంజామల మండలం ఎగ్గోనిలో తాగునీటి సరఫరా కోసం నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ పైనుంచి దూకి యువకుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా ముద్దనూరు మండలం ఉప్పలూరుకు చెందిన కర్నాటి హర్షవర్ధన్ రెడ్డి(30) ఎగ్గోనిలోని తన సోదరి ఇంటికి 2 రోజుల క్రితం వచ్చాడు. అయితే మద్యానికి బానిసగా మారి, ఆరోగ్యం చెడిపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 13, 2025

విశాఖ: పరీక్ష బాగా రాయలేదని విద్యార్థిని సూసైడ్

image

ఫిజిక్స్ పరీక్ష సరిగా రాయలేదని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో చోటుచేసుంది. సర్క్యూట్ హౌస్ సమీపంలో నివాసముంటున్న ఓ విద్యార్థిని ఫిజిక్స్ పరీక్ష రాసింది. ఇంటికి వచ్చి పరీక్ష బాగా రాయలేదని బాధపడగా ఆమె తల్లి ఓదార్చి నిద్రపోయింది. బుధవారం ఉదయం ఆమె నిద్రలేచి చూసేసరికి విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు త్రిటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 13, 2025

విజయసాయి రెడ్డికి ఎవరిపై ప్రేమ పుట్టిందో?: అమర్‌నాథ్‌

image

AP: వైసీపీ అధినేత జగన్‌పై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన <<15734998>>వ్యాఖ్యలపై<<>> మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పందించారు. ‘విజయసాయి రెడ్డికి ఎవరిపై ప్రేమ పుట్టిందో? ఒకరిపై ప్రేమ పుడితేనే మరొకరిపై మనసు విరుగుతుంది. జగన్ 2024లో అధికారంలోకి వచ్చి ఉంటే ఇలా మాట్లాడేవారా? విజయసాయి వ్యవసాయం చేయరని, రాజకీయం మాత్రమే చేస్తారని నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలతో అర్థమైంది’ అని కౌంటర్ ఇచ్చారు.

News March 13, 2025

ఐ.పోలవరం: రోడ్డు ప్రమాదంలో తోబుట్టువులకు పుత్ర శోకం

image

ఐ.పోలవరం మండలం ఎదురులంక వారధిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తోబుట్టువుల కొడుకులు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముమ్మిడివరం M కొత్తలంకకు చెందిన సాంబశివ (14), తాళ్ళరేవు M సుంకరపాలానికి చెందిన వీరేంద్ర (18) మృతి చెందిన విషయం తెలిసిందే. బైక్ పై వస్తున్న వీరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. సాంబశివ 9వ తరగతి చదువుతుండగా వీరేంద్ర మినీ ఆటో యజమాని.

error: Content is protected !!