News March 26, 2025
డిచ్పల్లి: చిన్నారులు ఉన్నత స్థానాలకు ఎదగాలి: కలెక్టర్

మానవతా సదన్ చిన్నారులు ఉన్నత స్థానాలకు ఎదగాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. అనాధ బాలలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు వీలుగా ఇది వరకు జిల్లాలో కలెక్టర్గా కొనసాగిన ప్రస్తుత రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితారాణా తన హయాంలో 2016లో నెలకొల్పారు. మానవతా సదన్ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో ప్రత్యేకతను చాటుకుంటోందని అన్నారు.
Similar News
News April 1, 2025
NZB: IIIT విద్యార్థి ఆత్మహత్య.. కాశీలో అంత్యక్రియలు

వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన <<15944978>>రాహుల్ చైతన్య(18) అలహాబాద్ IIITలో ఆత్మహత్య చేసుకున్న<<>> విషయం తెలిసిందే. కాగా రాహుల్ చైతన్య అలహాబాద్ IIITలో బీటెక్ చేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రాహుల్ చైతన్య అంత్యక్రియలను కాశీలో నిర్వహించారు.
News April 1, 2025
నిజామాబాద్ జిల్లాలో భానుడి భగభగ

నిజామాబాద్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. మోస్రాలో 41.5℃, ఎడపల్లి 41.4, పెర్కిట్ 41.4, కోటగిరి 41.4, నిజామాబాద్ 41.3, గోపన్నపల్లి 41.3, వేంపల్లి 41.2, వైల్పూర్ 41.1, మెండోరా 41.1, ధర్పల్లి 41, మగ్గిడి 40.9, మోర్తాడ్ 40.8, రెంజల్ 40.7, ఇస్సాపల్లి 40.6, చిన్నమావంది 40.6, జక్రాన్పల్లి 40.6, కమ్మర్పల్లి 40.5, మదనపల్లి 40.5, సాలూర 40.3, భీమ్గల్ 40.3, కొండూరు 40.2℃ ఉష్ణోగ్రత నమోదైంది.
News April 1, 2025
NZB: బిక్షాటన డబ్బులు ఎక్కువ వస్తున్నాయని బాలుడి హత్య

NZBలో 14 నెలల బాలుడు కైలాస్ హత్య కేసును వన్టౌన్ పోలీసులు చేధించారు. మహారాష్ట్రకు చెందిన బోస్లే మాలాబాయి, ఆమె కొడుకు గోపాల్ హత్య చేసినట్లు వన్టౌన్ SHO రఘుపతి తెలిపారు. పోలీసుల వివరాలు.. కమలాబాయి అనే మహిళకు బిక్షాటన చేసే సమయంలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయని.. అదే సమయంలో వీరికి తక్కువ డబ్బులు రావడంతో కక్షతో ఈ నెల 27న రైల్వే స్టేషన్లో నిద్రిస్తున్న బాలుడిని తీసుకెళ్లి బండి రాయితో కొట్టి హత్య చేశారు.