News October 10, 2024

‘డీసీసీబీ ద్వారా రూ.2350 కోట్ల విలువైన సేవలు అందించాం’

image

ఉమ్మడి జిల్లాలో డీసీసీబీ బ్యాంకు ద్వారా రైతులకు ఇప్పటివరకు రూ.2,350 కోట్ల సేవలు అందించడం జరిగిందని ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి అన్నారు. డీసీసీబీ గజ్వేల్ శాఖ పూర్తి చేయడంతో బ్యాంకు మేనేజర్ రమేష్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. సంబరాల్లో పాల్గొని కేక్ కట్ చేసి మహిళా సంఘాలకు రుణాలు అందజేశారు. ఉమ్మడి జిల్లాలో డీసీసీబీ బ్యాంకు 400 కోట్ల టర్నోవర్ ఉండగా ప్రస్తుతం రూ.2,350 కోట్లకు చేరుకుందన్నారు.

Similar News

News October 10, 2024

సిద్దిపేట: ఒకే ఇంట్లో నలుగురికి MBBS సీట్లు

image

సిద్దిపేటకు చెందిన రామచంద్రం, శారద దంపతుల నలుగురు కుమార్తెలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS‌ సీట్లు పొందారు. పెద్ద కుమార్తె మమత 2018లో MBBS‌లో చేరి డిగ్రీ పూర్తి చేసింది. రెండో కుమార్తె మాధవి 2020లో, ఈ ఏడాది మరో ఇద్దరు కుమార్తెలు రోహిణి, రోషిణి MBBS‌లో సీటు సాధించారని తండ్రి రామచంద్రం తెలిపారు. KCR జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతోనే ఇది సాధ్యమైందన్నారు. నేడు ఎమ్మెల్యే హరీశ్ రావును కలిశారు.

News October 10, 2024

సబ్జెక్ట్ టీచర్ లేని ఉన్నత పాఠశాలకు ప్రాధాన్యత నివ్వాలి: పీఆర్టీయూ

image

సబ్జెక్ట్ టీచర్ లేని ఉన్నత పాఠశాలల్లో మొదటి ప్రాధాన్యతగా భర్తీ చేయాలని మెదక్ డీఈవో రాధాకిషన్‌ను పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు సుంకరి కృష్ణ కోరారు. సింగిల్ స్కూళ్లలో బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేస్తూ ఆ పాఠశాలల్లో నూతన ఉపాధ్యాయులతో భర్తీ చేయాలన్నారు. విద్యార్థుల సంఖ్య కాకుండా సాంక్షన్ పోస్ట్ ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను నింపాలని కోరారు. ఇందులో సంగమేశ్వర్, ఖదీర్, శ్రీనివాస్ ఉన్నారు.

News October 10, 2024

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో సిద్దిపేటకు నాలుగు పతకాలు

image

హనుమకొండలో రెండు రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేట జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. రెండు చొప్పున వెండి, కాంస్య పతకాలు సాధించారని జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు పరమేశ్వర్, ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి తెలిపారు. రాఘవపూర్‌కు చెందిన గ్యార లీలా, ఆనంద్ డేకథ్లాన్, హై జంప్‌లో 2-కాంస్యం, నగేశ్ అండర్-18 జావెలిన్ త్రోలో వెండి, షాట్ పుట్‌లో వాసు వెండి పతకం సాధించారు.
-CONGRATS