News February 20, 2025
డోర్నకల్: అనారోగ్యంతో చిన్నారి మృతి

అనారోగ్యంతో చిన్నారి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన బాలిక ప్రజ్ఞాశాలిని(8) వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో కుటుంబీకులు చిన్నారిని HYDలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు వారు తెలిపారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
Similar News
News December 23, 2025
ADB: ‘ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి’

ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలియజేశారు. సోమవారం హైదరాబాదు నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పాల్గొన్నారు. వచ్చే వారంలోగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో వృద్ధి నమోదు కావాలన్నారు. ఫారం-8 ద్వారా అసలైన ఫోటోగ్రాఫ్ సేకరించి నవీకరించాలని సూచించినట్లు శ్యామలాదేవి పేర్కొన్నారు.
News December 23, 2025
నేడు నరసింహుడి రూపంలో భద్రాద్రి రామయ్య

భద్రాద్రి క్షేత్రంలో వైకుంఠ అధ్యయనోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నాలుగో రోజైన మంగళవారం సీతారామచంద్రస్వామి వారు ‘నరసింహ’ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుడిని రక్షించిన స్వామివారి కథను అర్చకులు స్మరించారు. నరసింహ రూపంలో ఉన్న రామయ్యను దర్శించుకుంటే శత్రు భయాలు, గ్రహ దోషాలు తొలగుతాయని విశ్వసించే భక్తులు ఆలయానికి పోటెత్తారు.
News December 23, 2025
బంగ్లాదేశ్లో మైనారిటీల నిరసన గళం

బంగ్లాదేశ్లో మైనారిటీలపై పెరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతున్నాయి. 25 ఏళ్ల హిందూ యువకుడు <<18624742>>దీపూ చంద్రదాస్ హత్య<<>> ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై తమకు న్యాయం చేయాలని ఢాకాలో మైనారిటీ వర్గాలు రోడ్డెక్కాయి. మైనారిటీల భద్రతను కాపాడడంలో యూనస్ ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించాయి. దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశాయి. మైనారిటీల హక్కులను పరిరక్షించాలని నిరసనకారులు కోరుతున్నారు.


