News February 8, 2025

తడ : హైవేపై ప్రమాదం

image

తడ మండలం కొండూరు హైవేపై ప్రమాదం జరిగింది. సూళ్లూరుపేట వైపు నుంచి తడ వైపు బైక్‌పై వెళుతున్న సినోఫర్ మహమ్మద్ (నెల్లూరు), జ్యోతి బాబే (గుమ్మిడిపూడి) అనే ఇద్దరు యువకులు ముందు వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సును ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన తడ హైవే మొబైల్ వాహనం సహాయంతో సూళ్లూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు.

Similar News

News February 8, 2025

NGKL: చెట్టు పైనుంచి జారిపడి గీతా కార్మికుడు మృతి

image

నాగర్ కర్నూల్ మండలంలోని నాగనూల్ గ్రామంలో చెట్టుపై నుంచి పడి గీతాచార్యుడు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్(58) రోజు మాదిరిగానే ఈత చెట్టు ఎక్కి గీస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లే లోపు మార్గమధ్యలో మృతి చెందాడు.

News February 8, 2025

అన్నమయ్య: తండ్రి, కూతురు మృతి UPDATE

image

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాద మృతుల వివరాలు లభించినట్లు ఎస్సై నరసింహుడు తెలిపారు. మృతులు మదనపల్లి ప్రశాంత్ నగర్‌కు చెందిన భవన కార్మికుడు సోమశేఖర్(35), కుమార్తె సిద్దేశ్వరి(03)గా గుర్తించామన్నారు. కదిరిలో పెదనాన్న అంత్యక్రియలకు బైకులో వెళుతుండగా.. ములకలచెరువు వద్ద ఐచర్ వాహనం ఢీకొట్టి తండ్రి, కుమార్తె చనిపోగా.. భార్య కవిత (25), కొడుకు రెడ్డి శేఖర్(05)ని రుయాకు తరలించారు.

News February 8, 2025

ముగ్గురు పిల్లల్ని కనండి.. హిందువులకు VHP పిలుపు

image

ప్రస్తుత జనన రేటు(1.9 శాతం) ప్రకారం హిందూ జనాభా తగ్గుతూనే ఉంటుందని VHP జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ చెప్పారు. జనాభా అసమతుల్యతను అధిగమించేందుకు ప్రతి హిందూ జంట ఇద్దరు/ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రతిజ్ఞ చేయాలన్నారు. కుటుంబాలు విడిపోవడం పిల్లలు, యువతలో అభద్రతకు కారణమవుతోందని తెలిపారు. హిందూ సంప్రదాయాలు పాటించడమే ఈ సమస్యకు పరిష్కారమన్నారు.

error: Content is protected !!