News March 3, 2025
తప్పుడు పత్రాల రిజిస్ట్రేషన్ల ముఠాపై కేసు నమోదు

తప్పుడు రిజిస్ట్రేషన్లు, డబుల్ రిజిస్ట్రేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తామంటూ నమ్మించి మోసం చేస్తున్న ముఠాపై కేసు నమోదు చేసినట్లు ఖానాపురం హవేలీ ఇన్స్పెక్టర్ భానుప్రకాశ్ తెలిపారు. మధుర నగర్కి చెందిన షేక్ బడే సాహెబ్, చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన కొత్తపల్లి వేంకటేశ్వర్లు, తిప్పర్తి అశోక్ కుమార్ (RI)పై కేసు నమోదు చేసి తప్పుడు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Similar News
News December 15, 2025
ఇంధన పొదుపు.. భవితకు మదుపు: కలెక్టర్

ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా భావితరాలకు వెలుగు నిద్దామని కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా సోమవారం భీమవరం ప్రకాశం చౌక్లో విద్యుత్ ఉద్యోగులతో చేపట్టిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ప్రస్తుతం మనం విద్యుత్ వృథా చేస్తే భవిష్యత్ తరాలకు అంధకారాన్ని మిగిల్చిన వారమవుతామన్నారు. ఇంధన ప్రాముఖ్యతను ఆదా చేయాల్సిన విధానాలను కలెక్టర్ నాగరాణి వివరించారు.
News December 15, 2025
విశాఖ: పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు స్ఫూర్తి

పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా విశాఖ కలెక్టరేట్లో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తి అని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు
News December 15, 2025
కృష్ణమ్మ చెంతనే దాహం.. తాగునీటికి తంటాలు.!

పెనమలూరు, తాడిగడప మున్సిపాలిటీ (యనమలకుదురు, కానూరు) కృష్ణా నది పక్కనే ఉన్నా, ఈ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. భూగర్భ జలాల్లో TDS 800-1200 ఉండటంతో అవి తాగేందుకు పనికిరావడం లేదు. దీంతో వీధుల్లో నాణ్యత లేని వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వచ్చాయి. ఇటీవల మంజూరైన అమృత్ 2.0 నిధులు రూ. 30 కోట్లతోనైనా 2 లక్షల జనాభాకు కృష్ణా నది జలాలను అందించాలని ప్రజలు కోరుతున్నారు.


